-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఉప్పల్, మార్చి 5: అనాధ ఆశ్రమం నుంచి ఇద్దరు బాలురు తప్పించుకున్న సంఘటన సోమవారం జరిగింది. బోడుప్పల్లోని సాయిరాంనగర్ సిల్వర్ లైన్ స్కూల్లో చదువుతున్న ఆర్.బలరాం (14), నర్సింగరావు (17)లు పాఠశాలకు వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. పాఠశాలకు చెందిన జి.నాగమధు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మేడ్చల్, మార్చి 5: అప్పటివరకు పాఠశాలలో తోటి విద్యార్థులతో చదువుకుని ఆడుతూ పాడుతూ ఇంటికి బయల్దేరిన ఓ బాలుడిని మృత్యురూపంలో వచ్చిన ప్రవేటు కాలేజీకి చెందిన బస్సు కబళించింది. బాలుడిని బస్సు చిదిమేసిన దృశ్యాన్ని చూసినా తోటి విద్యార్థులు ఇప్పటి దాకా తమతో సరదగా గడిపిన అతను అంతలోనే దుర్మరణం చెందడాన్ని చూసి జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.
రాజేంద్రనగర్, మార్చి 5: యజమాని రాక్షసత్వానికి కార్మికుడు బలైన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పరిధిలోని పారిశ్రామికవాడలో పెట్రోజంప్ అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీలో పని చేసే నిపుణ్సాహు(24) ఒరిస్సా నుంచి బతుకుదెరువు కోసం వచ్చి జీవనం సాగిస్తున్నాడు. నిపుణ్సాహు పని చేసుకుంటూ అదే కంపెనీలో ఉంటున్నాడు.
న్యూఢిల్లీ, మార్చి 5: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను రద్దుచేయాలని కోరుతూ మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు, కార్తీ చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. సిబిఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ఆధారం చేసుకొని, ఈడీకి నోటీసులు జారీ చేసే అధికారం లేదని కార్తీ చిదంబరం తన తాజా పిటిషన్లో వాదించారు.
కోరుట్ల, మార్చి 5: కోరుట్ల పట్టణంలోని శ్రీనివాస్ రోడ్డులో పాఠశాలకు వెళ్తున్న బి. నందిశ్వర్ అనే అనాథ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో దాడి చేసిన ఘటన సోమవారం కోరుట్లలో కలకలం రేపింది.
కరీంనగర్ (లీగల్), మార్చి 5: ఒకే కళాశాలలో చదువుతూనే బాలిక వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని, లేనియెడల చంపుతానని బెదిరించిన కేసులో నిందితుడైన కారుపాకల రఘునాథ్ (20)కు కరీంనగర్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్లు సోమవారం సంవత్సరం జైలుశిక్ష విధించారు.
ఆదిలాబాద్,మార్చి 5: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వి గ్రామ సమీపంలో గల ఫాంహౌస్లో ఆదిలాబాద్ టీచర్స్కాలనీకి చెందిన 15 ఏళ్ళబాలికపై సామూహిక అత్యాచారం జరిపిన సంఘటనలో నలుగురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంగ్రేప్ కేసుకు సంబంధించి వివరాలను ఆదిలాబాద్ డిఎస్పీ నర్సింహారెడ్డి వెల్లడించారు.
కనగల్, మార్చి 5: మండలంలోని దర్వేశీపురంలో నాలుగు రోజుల క్రితం జరిగిన కంచరకుంట నర్సమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. హత్యకు పాల్పడిన ఏ1 నిందితుడు వేమిరెడ్డి మాధవరెడ్డి నర్సమ్మకు అల్లుడు కాగా, ఏ3 నిందితురాలు ఏశమ్మ కుమార్తె కావడం గమనార్హం. సీఐ రమేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హతురాలు నర్సమ్మకు మొత్తం 6 ఎకరాల భూమి ఉంది.
బనగానపల్లె, మార్చి 5:మండల పరిధిలోని రామతీర్థం గ్రామ సమీపంలో ఎస్ఆర్బీసీ కాలువలో ఆదివారం గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైనట్లు ఎస్ఐ శంకరయ్య తెలిపారు. వివరాలు.. మృతుడిని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బోయ నరసింహుడు(20)గా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.
బనగానపల్లె, మార్చి 5:బనగానపల్లె పోలీస్స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామంలో సోమవారం రైతు శ్రీనివాసరెడ్డి ఏకైక కుమారుడు సురేంద్రనాథరెడ్డి(3) ట్రాక్టర్ కిందపడి దుర్మరణం చెందాడు. బంధువులు తెలిపిన ప్రకారం.. శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్లో పొలం నుంచి జొన్నచొప్ప తీసుకొచ్చి ఇంటికి సమీపంలోని కళ్లంలో వదలుతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు.