S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/10/2018 - 01:16

నార్సింగి, ఫిబ్రవరి 9: రోడ్డుప్రమాదంలో పదోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు మృతిచెందగా, మరో విద్యార్థి గాయాలపాలైన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఈ సంఘటనతో గుడిమల్కాపూర్‌లో విషాధచాయలు అలుముకున్నాయి.

02/10/2018 - 01:15

దౌల్తాబాద్/వికారాబాద్, ఫిబ్రవరి 9: శ్రీశైలం ఘాట్‌రోడ్‌లో లారీ ఢీకొని వికారాబాద్ జిల్లాకు చెందిన శివమాల ధారణ స్వాములు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మధు (18), గుండెపల్లికి చెం దిన చంద్రప్ప(19) వ్యవసాయం చే స్తూ జీవనం సాగిస్తుంటారు.

02/10/2018 - 01:14

నార్సింగి, ఫిబ్రవరి 9: పట్టపగలు కత్తులతో దాడిచేసిన సంఘటనలో ఒకరు మృతి చెందడంతో ముగ్గురు రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.వివరాలను పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఏ.వెంకటేశ్వర్ రావు శుక్రవారం విలేఖర్లకు వెల్లడించారు.

02/10/2018 - 01:12

కొత్తగూడ, ఫిబ్రవరి 9: మండలంలోని ఎంచగూడ గ్రామం నుండి కృష్ణా జిల్లాకు అక్రమంగా తరలిస్తున్న సబ్సిటీ గొర్రెల వాహనాలను శుక్రవారం పట్టుకొని సీజ్ చేసినట్లు డీఎస్పీ ఏ నరేశ్ కుమార్ తెలిపారు.

02/10/2018 - 01:12

కొత్తగూడ, ఫిబ్రవరి 9: గత నెల 28న గంగారం మండల కేంద్రంలో ఆయుధాలు కొనుగోలు చేసి పరారీలో ఉన్న మరో ఇద్దరు మావోయిస్టు కొరియర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు గూడూరు సీఐ రమేశ్ నాయక్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ రమేశ్ నాయక్ మాట్లాడుతూ..

02/10/2018 - 01:08

కురవి, ఫిబ్రవరి 9: వ్యవసాయం కలిసిరాకపోవడం.. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబంలో కలహాలు చెలరేగడంతో గిరిజన యువరైతు బోడ సేవన్ (శ్రావణ్-32) పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన కురవి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహబూ బాబాద్ జిల్లా కురవి మండల కేంద్ర శివారు లచ్చిరాంతండాకు చెందిన బోడ సేవన్ తన తండ్రి వీరన్న నుండి సంక్రమించిన రెండు ఎకరాలలో మిర్చి తోట వేసాడు.

02/10/2018 - 01:04

కరీంనగర్, ఫిబ్రవరి 9: హైదరాబాద్ నుండి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి అక్రమంగా బోలెరో వాహనంలో తరలిస్తున్న గుట్కాను మానకొండూర్ మండలం సదాశివపల్లి వద్ద శుక్రవారం టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచీ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. బోలెరా వాహన యజమాని గోదావరిఖనిలోని కళ్యాణ్‌నగర్‌కు చెందిన చిదురాల శ్యాంసుందర్ (28), కాకతీయనగర్‌కు చెందిన క్లీనర్ ఎలాపుల సంతోష్ (23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

02/10/2018 - 01:03

కరీంనగర్, ఫిబ్రవరి 9: కరీంనగర్‌లో యధేచ్ఛగా లారీలను ఎత్తుకెళ్తూ, మహారాష్ట్ర పర్బనీ జిల్లా కేంద్రంగా విడిభాగాల కింద అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు అయింది. ఎత్తుకెళ్లిన లారీకి జీపీఎస్ విధానం ఉండటంతో గత కొనే్నళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా స్థావరం ఎట్టకేలకు చిక్కింది.

02/10/2018 - 01:01

గనే్నరువరం, ఫిబ్రవరి 9: హనుమాజిపల్లి గ్రామానికి చెందిన వివాహిత లింగాల శైలజ (28) శుక్రవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామానికి చెందిన చాడ రాజిరెడ్డి తన కూతురును హనుమాసిపెల్లి గ్రామానికి చెందిన లింగాల నర్సింహారెడ్డి కుమారుడు లింగల సామిరెడ్డికి తన కూతురు శైలజను 8 సంవత్సరాల క్రితం ఇచ్చి పెళ్లి చేశాడని తెలిపారు.

02/10/2018 - 00:55

జహీరాబాద్, ఫిబ్రవరి 9: రెండు రోజుల కిందట అదృశ్యమైన ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని దిడిగి గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలో మేతరి మాణమ్మ(45) అనే మహిళ హత్యకు గురైంది. రెండు రోజుల కింద అనగా బుధవారం రోజువారిగా పొలానికి వెళ్లి అదృశ్యమైంది. మృతురాలు శుక్రవారం తన స్వంత చెరుకు తోటలోనే రక్తపు మడుగులో శవమై పడివుంది.

Pages