S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/09/2018 - 04:05

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తన మార్చుకోకుండా జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలు స్నాచింగ్‌లతో పాటు చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థున్ని సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపి శ్రీనివాస రావు కేసు వివరాలను వెల్లడించారు.

02/09/2018 - 03:52

చిట్యాల, ఫిబ్రవరి 8: గొర్రెల లోడుతో వెళుతున్న డీసీఎం కల్వర్టును ఢీకొని బోల్తాపడటంతో ఇద్దరు గొర్రెకాపరులు, డీసీఎం క్లీనర్‌లతో పాటు డీసీఎంలోని 56గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున నల్ల గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో చోటుచేసుకుంది. ఘటనలో డ్రైవర్ మేడిపల్లి వెంకటేష్‌కు తీవ్రగాయాల య్యాయి. చిట్యాల సీఐ కె.

02/09/2018 - 03:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసును పూర్తిగా భూ వివాదంగానే పరిగణించి విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను గురువారం చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గంటపాటు ఇరుపక్షాల వాదనలను విన్నది.

02/09/2018 - 03:53

హైదరాబాద్, ఫిబ్రవరి 8: అక్షయగోల్డ్‌కు సంబంధించిన 300 ఆస్తుల మార్కెట్ విలువను, ప్రభుత్వం నిర్ణయించిన విలువను సీల్డ్ కవర్‌లో పెట్టి ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగాన్ని ఆదేశించింది. అక్షయ గోల్డ్ ప్రజలను మోసం చేసిందని, ఈ వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.

02/09/2018 - 03:59

హైదరాబాద్, ఫిబ్రవరి 8: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో నల్లగండ్ల చెరువుపూర్తి స్థాయి నీటి మట్టం కొలతను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ఎక్కడ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు జిహెచ్‌ఎంసిని ఆదేశించింది.

02/07/2018 - 01:23

సిరిసిల్ల, ఫిబ్రవరి 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సబ్సిడీ గొర్రెలు పక్కదారి పట్టి మాంసం మార్కెట్‌కు తరలిస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా సీసీఎస్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

02/07/2018 - 01:20

ముకరంపుర కరీంనగర్, ఫిబ్రవరి 6: కరీంనగర్ కేంద్రంగా గంజాయి అమ్మకం, సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురిని కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి గంజాయి, మోబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కొత్తపల్లి పోలీసుల సహాయంతో రిమాండ్‌కు తరలించారు.

02/07/2018 - 00:31

నరసన్నపేట, ఫిబ్రవరి 6: మండలంలోని గోపాలపెంట గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మంగళవారం మధ్యాహ్నం 12 సమయంలో టీడీపీ కార్యకర్త చిట్టి పాపారావు(36) సమీప జీడితోటల్లో పురుగుల మందు తాగి తన మృతికి కారణాలు తెలుపుతూ లేఖను కూడా రాసుకున్నాడు.

02/07/2018 - 00:14

ఉదయగిరి, ఫిబ్రవరి 6: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బంది, ఉదయగిరి ఎస్‌ఐ నక్కా ప్రభాకర్, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా సోమవారం మండలంలోని కొత్తపల్లి అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పట్టుకున్నారు.

02/07/2018 - 00:01

సామర్లకోట, ఫిబ్రవరి 6: సామర్లకోట పంచారామాక్షేత్రం భీమేశ్వరాలయంలో హుండీల చోరికి పాల్పడిన కేసులో నిందితుని అరెస్టు చేసి అతని వద్ద నుండి రూ.10,000లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డిఎస్పీ చిలకా వెంకట రామారావు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సామర్లకోట పోలీసు స్టేషన్ పై భాగంలోవున్న సిసిఎస్ స్టేషన్ భవనంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నిందితుడిని చూపారు.

Pages