S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సత్యశ్రీ, సుబ్బారెడ్డి, శ్రావణి ముఖేష్, నరేష్ ముఖ్య పాత్రల్లో క్రాంతి కిరణ్ దర్శకత్వంలో ఓం శక్తి ప్రొడక్షన్స్ పతాకంపై బి.సత్యశ్రీ నిర్మిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఆశల హరివిల్లు’. శ్రీనివాస్ మాలపాటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో విడుదలయ్యాయి.
విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘పరిచయం’. ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అసిన్ మూవీక్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మించారు. శేఖర్చంద్ర స్వరాలు అందించారు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో ప్రొడక్షన్ 3గా వస్తున్న చిత్రం ‘సిల్లోఫెలోస్’. అల్లరి నరేష్, సునీల్, చిత్ర శుక్లా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కిరణ్రెడ్డి, భరత్ చౌదరి, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నేచురల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రం తెరకెక్కటం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. త్రివిక్రమ్ గతంలోనే నానితో సినిమా చేద్దామనుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దగ్గరనుంచి ఆ చిత్రానికి సంబంధించి ఎలాంటి స్పందన రాలేదు.
అలనాటి విశ్వనాథ చక్రవర్తి, లెజెండ్ స్వర్గీయ ఎస్వీ రంగారావుగారి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 జూలై 2018న ఆయన స్వస్థలం అయిన ఏలూరులో ఎంఎల్ఏ బడేటి కోట రామారావు(బుజ్జి) ఎస్వీ రంగారావు కుటుంబీకులు సంయుక్తంగా అతి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. విజయ్ ఎలకంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రత్యేక అతిథిగా మంచు మోహన్బాబుతో రకుల్ప్రీత్సింగ్, దర్శకుడు వంశీకృష్ణ, నిర్మాత స్వప్నదత్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ట్రైలర్ లాంఛ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సినిమా ట్రైలర్ను మోహన్బాబు ఆవిష్కరించారు. రకుల్ప్రీత్సింగ్ మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ నేనే ముందు చూశాను.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన జై లవకుశ సినిమా గత ఏడాది ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఆ సినిమాను మలయాళంలో విడుదల చేయాలని చూస్తున్నారు. రావణా అనే పాత్ర మంచి హైలెట్ అవ్వడంతోపాటు ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం సినిమాకు హైలెట్గా నిలిచింది. రావణాసురన్ అనే పేరుతో అక్కడ విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్కు మలయాళంలో కూడా మంచి మార్కెట్ ఉంది.
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళ్లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో జె.ఎస్.కె. ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగులో అందిస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. సుమారు 40 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్లుక్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నారని సమాచారం.
శంకర్ని హీరోగా, శ్రీ్ధర్.ఎన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్ఆర్ పిక్చర్స్ సంస్థ ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘శంభో శంకర’. ఈ సినిమా టీజర్ని దర్శకుడు హరీశ్ శంకర్ విడుదల చేశారు. అనంతరం నిర్మాత వై.రమణారెడ్డి మాట్లాడుతూ- శంకర్, సురేష్ కొండేటి సహకారంతో శంభో శంకర సినిమాను నిర్మించాను. ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అన్నారు.