S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/16/2018 - 01:14

న్యూఢిల్లీ, జూలై 15: ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, నీతి, విజ్ఞానానికి భాష అద్దం పడుతుందని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్ర విద్యా సంస్థ స్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలో విద్యాబోధనను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేయాలని పిలుపునిచ్చారు.

07/16/2018 - 01:12

న్యూఢిల్లీ, జూలై 15: ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శలు గుప్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆ పార్టీ దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ- నరేంద్ర మోదీ అబద్ధాలు చెబుతున్నారని, దేశంలోని అన్ని మతాలు, భాషలవారి పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.

07/16/2018 - 00:58

న్యూఢిల్లీ, జూలై 15: షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థుల్లో పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలకు అర్హులైన వారికి సొమ్మును చెల్లించేందుకు వీలుగా గడువును పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ స్కీంను ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యా సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం కోరింది. ఈ ఆదేశాలను విద్యా సంస్థ లు పాటించాలని ఆదేశించింది.

07/16/2018 - 00:58

న్యూఢిల్లీ, జూలై 15: రష్యా ఆధ్వర్యంలో వచ్చే నెల 20 నుంచి 29వ తేదీల మధ్య జరిగే మెగా మిలిటరీ విన్యాసాల్లో రష్యాతో పాటు, భారత్, పాకిస్తాన్, షాంఘై సహకార సంస్థలోని సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపడం, వేర్పాటువాదుల పీచమణచడం, ఈ లక్ష్యసాధనకు వ్యూహాలను అమలు చేయడంపై పరస్పరం సహకారం అందించుకోవడం లక్ష్యంగా మెగా మిలిటరీ విన్యాసాలు నిర్వహించనున్నారు.

07/16/2018 - 00:57

న్యూఢిల్లీ, జూలై 15: హజ్ యాత్రపై ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణల కారణంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో హజ్‌యాత్రికులు పెరిగారని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. మొదటి విడతగా 410 మంది హజ్‌యాత్రికుల ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. 12 వందల మందికిపైగా హజ్ యాత్రికులు ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి సౌదీఅరేబియాకు శనివారం బయలుదేరారని ఆయన చెప్పారు.

07/16/2018 - 00:56

న్యూఢిల్లీ, జూలై 15: వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశంలో జరుగుతున్న మత హింస, అమాయకులపై దాడులు తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై సీపీపిఐ, సీపీఐ (ఎం) చర్చించాయి.

07/16/2018 - 00:55

మనామా, జూలై 15: బహ్రేన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం ఆ దేశ ప్రధాని ఖలిఫా బిన్ సల్మాన్, అల్ ఖలీఫాతో సమావేశమై, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం బహ్రేన్ విదేశాంగ శాఖ మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో కలిసి జాయింట్ కమిషన్ సమావేశంలో పాల్గొన్నారు. 2015 డిసెంబర్‌లో భారత్, బహ్రేన్ హైజాయింట్ కమిషన్ (హెచ్‌జేసీ) మొదటి సమావేశం న్యూఢిల్లీలో జరిగింది.

07/16/2018 - 00:54

న్యూఢిల్లీ, జూలై 15: మాజీ ముఖ్యమంత్రి అజిత్‌జోగి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని, ఆయనకు పార్టీ తలుపులు మూసుకుపోయాయని ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పిఎల్ పునియా స్పష్టం చేశారు. అలాగే మాయావతి నేతృత్వంలోని బహుజన్‌సమాజ్ పార్టీకి, జోగికి ఎలాంతి పొత్తు ఉండదని అన్నారు. జోగి, బీజేపీ కలిసి ఈ వదంతులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

07/16/2018 - 00:52

న్యూఢిల్లీ, జూలై 15: పనిచేసే చోట లైంగిక వేధింపులు ఇప్పటికీ మహిళలకు నిత్యసమస్యగా మారిందని ముఖ్యంగా ఇది ప్రజలకు వినోదాన్ని అందించే చిత్రపరిశ్రమలో ఎక్కువగా ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ పేర్కొన్నారు.

07/16/2018 - 00:52

న్యూఢిల్లీ, జూలై 15: అభివృద్ధిలో భారత్‌దేశం వెనక్కి వెళుతోందన్న విమర్శలు చేసేముందు నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ భారత్‌ను ఒకసారి సందర్శించి ఇక్కడ మోదీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలను పరిశీలించాలని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్‌కుమార్ కోరారు.

Pages