S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/13/2018 - 12:47

న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలతో సమావేశమైన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వెంట పీసీసీ చీఫ్ రఘువీరా కూడా ఉన్నారు.

07/13/2018 - 12:46

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో అధికారం చేపట్టేందుకు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీని చీల్చాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బీజేపీని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ పాలన నడుస్తోంది. పలువురు పీడీపీ నేతలు బిజేపీని కలుస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ చేశారు.

07/13/2018 - 03:54

న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు అవినీతి ఆరోపణలకు తావులేకుండా జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ (సీపీడబ్ల్యుడీ) శాఖపై వస్తున్న అవినీతి అభియోగాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ ఆయన సీడీడబ్ల్యుడీ 164వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

07/13/2018 - 02:43

న్యూఢిల్లీ, జూలై 12: బంగ్లాదేశ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయే భారత్ తన వీసా తిరస్కరించిందని బ్రిటన్ లార్డ్స్ సభ్యుడు అలెగ్జాండర్ కార్లిలే ఆరోపించారు. జైలుశిక్ష అనుభవిస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు అలెగ్జాండర్ న్యాయసలహాదారుగా ఉన్నారు. కేసుకు సంబంధించి వివరాలు ఇక్కడ మీడియాకు వెల్లడించేందుకు బుధవారం రాత్రి ఆయన ఢిల్లీ వచ్చారు. అయితే ఆయనను అధికారులు విమానాశ్రయంలోనే నిలిపివేశాలు.

07/13/2018 - 02:18

పెషావర్, జూలై 12: స్వాత్ లోయ పూర్వ వైభవం సంతరించుకుంది. ముష్కర తాలిబాన్ల చెర నుంచి విముక్తి చెందిన స్వాత్ లోయ ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటి. 1947 వరకు అఖండ భారతంలో భాగమై ఉన్న స్వాత్ లోయ దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌కు దక్కింది. ఇక్కడ ఒకప్పుడు బౌద్ధ మతం విరాజిల్లింది. కాలక్రమంలో ఇస్లాం మత ప్రభావం వల్ల బౌద్ధం తన ఉనికిని కోల్పోయింది.

07/13/2018 - 02:10

పూణే, జూలై 12: హిందూ ఆధ్యాత్మిక గురువు, సాధు వస్వానీ మిషన్ అధిపతి దాదా జేపీ వస్వానీ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 99 ఏళ్లు. వయోభారంతో బాధపడుతున్న ఆయనను గతవారం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం కాస్తమెరుగుపడడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు మిషన్ వెల్లడించింది. పూణేలోని సాధు వస్వానీ ప్రాంగణంలోనే ఉదయం కన్నుమూశారని వారన్నారు.

07/13/2018 - 02:08

చెన్నైలోని ఆళ్వార్ పేటలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి జెండా ఎగురవేస్తున్న మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్

07/13/2018 - 02:06

న్యూఢిల్లీ, జూలై 12: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలో 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతులందరూ ఆత్మహత్య చేసుకుని మరణించారని పోస్టుమార్టమ్ నివేదికలోవైద్యులు తేల్చారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులందరూ ఉరివేసుకుని మరణించారు. బురారీ కుటుంబానికి చెందిన 11 మంది ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకుని మరణించిన విషయం విదితమే.

07/13/2018 - 02:05

న్యూఢిల్లీ, జూలై 12: విద్యా రంగంలో హిందుత్వ, నయా ఉదారవాద చొప్పిస్తూ బ్రష్టుపట్టిస్తున్న బీజేపీ మతతత్వ విధానాలను వ్యతిరేకించాలని అధ్యాపకులు, విద్యార్థులకు సీపీఎం పిలుపునిచ్చింది. పార్టీ పత్రిక పీపుల్స్ డెమాక్రసీలో పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ కేంద్రం అనుసరిస్తున్న విద్యావిధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ వ్యాసం రాశారు.

07/13/2018 - 02:05

కోల్‌కతా, జూలై 12: మథర్ థెరిస్సా నెలకొల్పిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ పేరును చెడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. రాంచీలోని మిషనరీస్ ఆఫ్ చారిటీలో పసిపిల్లలను అమ్ముకుంటున్నారంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు.

Pages