రెండవ రోజూ డబ్బుల్లేవు!
Published Friday, 2 December 2016అనంతపురం అర్బన్, నవంబర్ 2:శ్రమజీవులకు వేతనాల తిప్పలు రెండవరోజు తప్పలేదు. వేతనంతో కుటుంబాలను నెట్టుకొచ్చే ఉద్యోగులు గత నెలలో నగదు సమస్య నుంచి బయట పడ్డవారు. ఈనెల 8న ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో డిశంబర్ 1న వేతనాలు అందకపోవడంతో ఇంటి అద్దెలు, పాలు, పిల్లల స్కూల్ ఫీజులు తదితర వాటికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగదు సమస్యలేదని అధికారులు కొందరు పేర్కొంటుండగా అమలులోకి వచ్చేసరికి తీవ్ర ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు పదివేల అందజేస్తామన్న ప్రభుత్వం చివరికి ఆ పదివేలు సైతం అందించలేక చేతులు ఎత్తేసింది. ఇక పింఛన్దారులది అదే పరిస్థితు వీరి అకౌంట్లు ఖాళీ చూపిస్తున్నాయి.