వీళ్లని చూసి గర్విస్తున్నా
Published Monday, 29 August 2016న్యూఢిల్లీ, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్లో అద్భుతంగా రాణించి, దేశాన్ని గర్వంతో తలెత్తుకునేలా చేసిన అమ్మాయిలను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్లో రజత, కాంస్య పతకాలను గెల్చుకున్న పివి సింధు (బాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లర్) తోపాటు, జిమ్నాస్టిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్, ఈఏడు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన షూటర్ జీతూ రాయ్ ఆదివారం ప్రధానిని కలిశారు. సోమ వారం క్రీడా పురస్కారాల ప్రదానం జరగను నేపథ్యం వీరు ఇక్కడికి వచ్చారు. కాగా, ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అమ్మాయిల శక్తిసామర్థ్యాలు ఏమిటో సింధు, సాక్షి, దీప నిరూపించారని అన్నారు.