న్యాయమైన పరిహారం చెల్లిస్తేనే భూములిస్తాం
Published Sunday, 28 August 2016గోదావరిఖని, ఆగస్టు 28: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించి భూములు తీసుకుంటానంటే సరికాదని.. న్యాయమైన పరిహారం చెల్లిస్తూ.. భూములు కోల్పోయిన వారందరికి ప్రాజెక్ట్లో ఉపాధి అవకాశం కల్పిస్తానంటేనే తమ భూములిస్తామని గోలివాడ రైతులు తెగేసి చెప్పారు. ఆదివారం రామగుండం మండలం గోలివాడలో భూసేకరణపై అభిప్రాయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఆర్డీఓ అశోక్కుమార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఇ సుధాకర్ రెడ్డి, తహశీల్దార్ గుడూరి శ్రీనివాస రావు పాల్గొన్నారు.