గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
Published Sunday, 28 August 2016ఇచ్చోడ, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలతో పాటు విద్యారంగాన్ని అభివృద్దిపర్చేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని ముక్రాకె గ్రామంలో రూ.28లక్షల నిధులతో నిర్మించిన పాఠశాల అదనపు గదులు, కోకస్మన్నూర్ గ్రామంలో సుమారు రూ.19లక్షల నిధులతో నిర్మించిన ప్రైమరి పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవంతో పాటు హరితహారం, ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్న అనంతరం కోకస్మన్నూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.