నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా
Published Monday, 29 August 2016ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని కోట్లాది మంది ఆంధ్రులు ధర్నాలు, నిరసనలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. రాజ్యసభలో 2014 ఫిబ్రవరి 20న విభజన బిల్లు ఆమోదించారు. 01-4-2014 కేంద్ర మంత్రి వర్గం తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఐదు కాదు, పది సంవత్సరాలు అడుగుతామని రాజ్యసభ దృశ్యాలు, వార్తలలో అందరూ చూసినదే. తిరుపతి సభలో ప్రధాని మోదీ ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ఆధారాలు ప్రజలు వేలెత్తి చూపుతున్నాయి. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై కేంద్రమంత్రి అరుణ్జైట్లీ సమాధానంతో కోట్లాది మంది ఆంధ్ర ప్రజ లు దిగ్భ్రాంతికి లోనయ్యారు.