డిటిసి మోహన్కు 15రోజుల రిమాండ్
Published Saturday, 30 April 2016కాకినాడ: కాకినాడలో డిటిసి (డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్)గా పనిచేస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడిన ఆదిమూలం మోహన్ను ఎసిబి అధికారులు శనివారం కృష్ణాజిల్లా చల్లపల్లి జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం ఆయనను విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15రోజుల రిమాండ్ విధించారు. కాకినాడతో పాటు పలు ప్రాంతాల్లో మోహన్కు చెందిన ఇళ్లలో ఎసిబి అధికారులు సోదాలు చేసి వందల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.