S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/19/2017 - 00:43

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి భారత రాష్టప్రతి రామనాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమం మంగళవారం ఎల్‌బి స్టేడియంలోని పాల్కురికి సోమన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బమ్మెరపోతన వేదికపై జరుగుతాయి. రాష్టప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. బేగంపేట నుండి రాజ్‌భవన్ వెళతారు.

12/19/2017 - 00:42

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలుగు ప్రాంతంలో లేకపోయినప్పటికీ, ఈ భాషకు విశేషంగా శ్రమించిన కొంత మందిని తెలుగు మహాసభల సమయంలో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కన్నడ ప్రాంతాన్ని పాలించినప్పటికీ, తెలుగు భాషకు శ్రీకృష్ణదేవ రాయలు చేసిన సేవ అజరామరం. అలాంటి మహనీయుడికి మహాసభల్లో సముచిత ప్రాధాన్యం లేదన్న విమర్శలున్నాయి.

12/19/2017 - 00:42

హైదరాబాద్, డిసెంబర్ 18: భాష సుసంపన్నం కావాలంటే పాత్రికేయులు రచయితల కన్నా ఎక్కువ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు అన్నారు. తెలుగు మహాసభలను పురస్కరించుకుని రవీంద్రభారతి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రాంగణం డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి వేదికపై పత్రికలు- ప్రసార మాధ్యమాల్లో తెలుగు అంశంపై జరిగిన గోష్టిలో సీనియర్ పాత్రికేయులు, ఎడిటర్లు పాల్గొన్నారు.

12/19/2017 - 00:40

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్‌లో జరుగుతున్న ఐదురోజుల తెలుగు పండగ మంగళవారం ముగుస్తోంది. కనీవిని ఎరగని రీతిలో ఈ పండగ జరగడంతో అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నెల 15 న ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం సాయంత్రం ముగుస్తున్నాయి. ముగింపు సమావేశంలో భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొనడం హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

12/19/2017 - 00:38

హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ భాష, సాహిత్యంపై లోతైన అధ్యయనం జరగాలని శాసనసభ స్పీకర్ సి మధుసూధనాచారి పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం బిరుదురాజు రామరాజు ప్రాంగణం సామల సదాశివ వేదికపై సోమవారం తెలంగాణ విమర్శ- పరిశోధన అనే అంశంపై విస్తృత చర్చ జరిగింది.

12/19/2017 - 00:37

ధర్మపురి, డిసెంబర్ 18: శాతవాహన చక్రవర్తుల తొలి రాజధానిగా వాసికెక్కి, గతంలో పురావస్తు శాఖ, ప్రస్తుతం పర్యాటక శాఖచే గుర్తింపు పొంది, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ చొరవ, టూరిజం చైర్మన్ పేర్వారం రాములు సహకారంతో త్వరలో కోటిలింగాలలో ప్రారంభం కానున్న టూరిజం బోట్ల నేపథ్యంలో కోటిలింగాల చరిత్రను వెలికితీసి, ప్రపంచానికి చాటిచెప్పిన ధర్మపురికి చెందిన దివంగత నరహరిశర్మను స్మరించాల్సిన అవసరం అనివార్యంగా ఉ

12/18/2017 - 03:36

హైదరాబాద్, డిసెంబర్ 17: జంటకవులంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది తిరుపతి వేంకట కవులని, అలనాడు గద్వాల సంస్థానంలో కవులకు ప్రాధాన్యత ఇచ్చేవారని పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగామూడవ రోజున రవీంద్ర భారతిలో డాక్టర్ యశోదారెడ్డి ప్రాంగణంలో బండారు అచ్చమాంబ వేదికలో జరిగిన జంటకవుల అష్టావధానంలో ఆయన మాట్లాడారు.

12/18/2017 - 03:35

హైదరాబాద్, డిసెంబర్ 17: సమకాలీన అంశాలు, సమాజంలోని పాత్రలతో కూడిన నవలలకు పాఠకాదరణ ఉంటుందని ప్రముఖ నవలా రచయిత గటిక విజయ్‌కుమార్ అన్నారు. తెలుగు భాషలోని అన్ని ప్రక్రియల కంటే కథ, నవలా ప్రక్రియలు భావితరాలకు సాహిత్యాభిలాషను కలిగించేందుకు దోహదం చేస్తాయన్నారు.

12/18/2017 - 03:37

హైదరాబాద్, డిసెంబర్ 17: రచనలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం అలిశెట్టి ప్రభాకర్ ప్రాంగణంలో ఆదివారం 4వ బృహత్ కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను కవులు,రచయితలు ప్రజలకు చేరవేయాలని అన్నారు.

12/18/2017 - 02:59

మహబూబ్‌నగర్, డిసెంబర్ 17: మహబూబ్‌నగర్ జిల్లాకే ఖ్యాతిని తీసుకువచ్చిన చారిత్రాత్మక పిల్లలమర్రి చెట్టు నేలకొరిగింది. దాదాపు ఏడు వందల ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ మహావృక్షానికి కొంతకాలంగా ఏదో ఓ రకమైన తెగులు తగిలి క్షీణించిపోయి నేల కూలింది. మర్రిచెట్టు నేలకూలిందని ఆదివారం ఉదయం పిల్లలమర్రికి వచ్చిన పర్యాటకులు గమనించారు. శనివారం రాత్రి చెట్టు కూలింది. చెట్టు నేలకూలడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

Pages