-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రంలో పంట రుణాలను ఏకమొత్తంలో ఒకేసారి మాఫీ చేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. నాలుగు వాయిదాల్లో రుణాలను మాఫీ చేయడం తగదన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ పంట రుణాల మాఫీపై ఇచ్చిన మార్గదర్శకాలు సమగ్రంగా లేవన్నారు. గతంలో చేసిన తప్పులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతులకు ఎటువంటి మేలు చేయలేదన్నారు.
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం 50వేల లోపు రుణం పొందిన రైతులకు ఒకే విడతలో రుణ మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి, ప్రధానకార్యదర్శి తీగల సాగర్ కోరారు. అల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సైతం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఒక లేఖ రాశారు. 50వేల లోపు రుణం పొందిన రైతులు 13.97 లక్షల మంది ఉన్నారని వీరికి 4301 కోట్లు సరిపోతాయని చెప్పారు.
హైదరాబాద్, మార్చి 18: రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన రుణ విమోచన పథకం అమలుకోసం తొలిదశలో 1210 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్దన్రావు పేరుతో జీఓ (ఆర్టీ నెంబర్ 149) జారీ అయింది. 2019-20 సంవత్సరంలో రుణమాఫీ కోసం బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలను కేటాయించగా, తొలిదశలో 1210 కోట్లను బుధవారం విడుదల చేశారు.
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణం, అడవులు, శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖల అభివృద్ధికి 2020-21 వార్షిక బడ్జెట్లో రూ.791.47 కోట్ల నిధులను కేటాయించింది. రాష్ట్రంలో ప్రకటిత అటవీ ప్రాంతం 27402.98 చదరపు కి.మీ ఉంది. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో అటవీ ప్రాంతం 24 శాతంగా ఉంది. అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది.
హైదరాబాద్, మార్చి 18: దేశాన్ని విచ్ఛిన్నపరుస్తున్న మతతత్వ శక్తులు ఏకం కావాలని ఆనాడే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇంద్రజిత్గుప్త వ్యాఖ్యానించారని, అదే బాటలో అంతా పయనించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రంలో రానున్న కాలంలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉన్నతాధికారులు ప్రణాళికను సిద్ధం చేస్తున్నాను. సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడానకి అవసరమైన వౌళిక వసతులను పొందేందుకు సహాయ, సహకారాలను ఎన్హెచ్పీసీతోసంప్రదిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 18: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మూడు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్కు సమర్పించింది.
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో జరిగే ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆహ్వానించారు.
హైదరాబాద్, మార్చి 18: రాష్ట్రంలో కరోనా విస్తరించకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
నిజామాబాద్, మార్చి 18: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.