S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/20/2016 - 18:12

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సోమవారం నాడు దుబాయ్ నుంచి వచ్చిన కృష్ణప్రసాద్ అనే ప్రయాణీకుడి నుంచి బుల్లెట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకులను తనిఖీ చేస్తుండగా బుల్లెట్ బయటపడడం కలకలం సృష్టించింది. అరెస్టు చేసిన నిందితుడిని విశాఖ వాసిగా పోలీసులు గుర్తించారు.

06/20/2016 - 18:11

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కార్డులను అనుమతించక పోవడంపై సోమవారం నాడు రోగులు నిరసనకు దిగారు. అదే సమయంలో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించారు. అయితే, ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వకుండా తమను బయటకు నెట్టేశారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

06/20/2016 - 18:11

హైదరాబాద్: హైదరాబాద్ నగరం సహా తెలంగాణలోని పలు జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమించారు. ఈమేరకు టి.టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి:
హైదరాబాద్‌ - ఇ. పెద్దిరెడ్డి,
రంగారెడ్డి - అరవింద్‌కుమార్‌ గౌడ్‌
మెదక్‌ - కె. దయాకర్‌రెడ్డి
ఖమ్మం - సీతక్క
నిజామాబాద్‌ - బి. మల్లయ్య యాదవ్‌
నల్గొండ - రేవూరి ప్రకాశ్‌రెడ్డి

06/20/2016 - 18:02

హైదరాబాద్‌ : బంగారానికి మెరుగుపెడతామని నమ్మించి మోసం చేస్తున్న బిహార్‌కు చెందిన ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. కిలోకుపైగా బంగారం, 4 ద్విచక్రవాహనాలను తూర్పు మండలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై పలు రాష్ట్రాల్లో 25 కేసులు, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 11, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2 కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు.

06/20/2016 - 16:10

హైదరాబాద్: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో కుంభకోణానికి సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంటు శాఖ) అధికారులు సోమవారం నాడు దిల్లీ, హైదరాబాద్, ముంబయి నగరాల్లో దాడులు చేయడం కొందరు నేతలకు కలవరం పుట్టించింది. ఈడీ దాడుల నేపథ్యంలో తమ జాతకాలెక్కడ బయటపడతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ దాడుల్లో అధికారులకు కీలక సమాచారం లభించినట్లు సమాచారం.

06/20/2016 - 16:09

నల్గొండ: మల్లన్నసాగర్ జలాశయం కోసం నష్టపరిహారం చెల్లించి రైతుల నుంచి భూములను సేకరిస్తున్నట్లు తెరాస సర్కారు చెబుతోందని, ఎకరాకు 25 కోట్లు చెల్లిస్తే కెసిఆర్ తన ఫాంహౌస్ భూములను ప్రజలకు ఇచ్చేస్తారా? అని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం తాను 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ రైతులను మంత్రి హరీష్‌రావు ఇంతవరకూ ఎందుకు కలుసుకోలేదని ఆయన అన్నారు.

06/20/2016 - 16:06

హైదరాబాద్: ఆర్టీసీ విభజన సమయంలో మంచి బస్సులన్నీ ఆంధ్రాకు ఇచ్చేశారని తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ అన్నారు. డొక్కుబస్సుల వల్లే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘం టిఎంయు సమావేశంలో ఆయన అన్నారు. టి.ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సిఎం కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు.

06/20/2016 - 16:05

వరంగల్: అకారణంగా రైతులపై దాడులు చేస్తూ ఫారెస్టు అధికారులు భయాందోళనలకు గురి చేస్తున్నారని సిపిఐ నేతలు ఆరోపించారు. ఫారెస్టు అధికారుల తీరును నిరసిస్తూ సిపిఐ నేతృత్వంలో మహబూబాబాద్‌లోని అటవీశాఖ కార్యాలయాన్ని వారు సోమవారం ముట్టడించారు. అక్రమ కేసుల్లో రైతులను ఇరికిస్తే గుణపాఠం ఖాయమని ఆందోళనకారులు హెచ్చరించారు.

06/20/2016 - 16:04

నల్గొండ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను సిఎం కెసిఆర్ దారుణంగా మభ్యపెడుతూ వంచిస్తున్నారని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, మాటలు తప్ప కెసిఆర్ సర్కారులో చేతలు లేవన్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వెళ్లిన వారు విధిగా పదవులకు రాజీనామా చేయాలన్నారు.

06/20/2016 - 16:03

మెదక్: తాను తెరాసలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఊపిరి ఉన్నంతవరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సోమవారం ప్రకటించారు. కాగా, ప్రజల మనోభావాల మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పాటుచేసే సంగారెడ్డి జిల్లాలోనే నర్సాపూర్, హుత్నూర, శివంపేట మండలాలను ఉంచాలన్నారు.

Pages