-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
రాజమహేంద్రవరం, జనవరి 7: రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించడానికి ఆరు హబ్లను అభివృద్ధి చేయనున్నట్లు పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ వెల్లడించారు. స్థానిక పరిస్థితులు, ఇతర అంశాల ఆధారంగా ఎకో, ఆధ్యాత్మిక, బీచ్, బ్యాక్వాటర్ పర్యాటకాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 7: అతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడంతో పాటుగా దేశీయ అభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో గురువారం ఒక్క రోజే 430 రూపాయలు పెరిగి తిరిగి 26 వేల రూపాయల స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది బంగారం ధర ఒక్క రోజులో ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. దీంతో పదిగ్రాముల మేలిమి బంగారం ధర ఢిల్లీ బులియన్ మార్కెట్లో రూ. 26,330 రూపాయలకు చేరుకుంది.
విశాఖపట్నం, జనవరి 7: విశాఖలో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజులపాటు సిఐఐ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ యువరాజ్, నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ తదితర ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. ఈ సదస్సుకు అతిరథ, మహారథులు హాజరవుతున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 7: మదుపరుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం లిక్విడిటీ బాగా లేని (ఇల్లిక్విడ్)) 386 కంపెనీల స్టాక్స్లో ట్రేడింగ్ జరిపేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాన స్టాక్ ఎక్స్చేంజిలయిన బిఎస్ఇ, ఎన్ఎస్ఇలు తమ సభ్యులకు సలహా ఇచ్చాయి. పరిమిత ట్రేడింగ్ ఉన్న కారణంగా సులభంగా విక్రయించడానికి వీలు లేని స్టాక్స్ను ఇల్లిక్లిడ్ స్టాక్స్గా పిలుస్తారు.
ముంబయి : చైనా స్టాక్ మార్కెట్ల పతనం భారత స్టాక్మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు నష్టపోయి 24,851 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 172 పాయింట్లు నష్టపోయి 7,568 వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, జనవరి 6: నల్లధనం వెలికితీతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. స్వచ్చంధ నల్లధన వివరాల వెల్లడి కార్యక్రమాన్ని గత ఏడాది చేపట్టినది తెలిసిందే. ఈ సందర్భంగా ప్రకటించిన ఆస్తులకు సంబంధించి మొత్తం 2,428.4 కోట్ల రూపాయల పన్నులను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. 2015 డిసెంబర్ 31 వరకు పన్నులు, జరిమానాల రూపంలో ఈ మొత్తాన్ని అందుకున్నట్లు ఓ ప్రకటనలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 6: ఉద్యోగ సృష్టికి, వ్యాపార, పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్త వెంచర్లకు 8,000 కోట్ల రూపాయల రుణ సదుపాయానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ముఖ్యంగా తక్కువ వడ్డీకి ఎస్సి, ఎస్టి మహిళా ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలకు రుణాలను అందించడానికి ‘స్టాండప్ ఇండియా’ పథకాన్ని ప్రకటించింది మోదీ సర్కారు.
గుంటూరు, జనవరి 6: తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి యోగ్యమైన ప్రదేశాన్ని గుర్తిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించటంతో రాజధాని గ్రామాల ప్రజలు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక సచివాలయ నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన మట్టి నమూనాలను సేకరించి భవన నిర్మాణాలకు పటిష్ఠమైన నేలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 6: ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన హెచ్ఎంటి వాచీలను తయారు చేసే విభాగంతోపాటుగా నష్టాలు వస్తున్న హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్ఎంటి)కి చెందిన మూడు విభాగాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. మూసివేయాలని నిర్ణయించిన మిగతా రెండు యూనిట్లలో హెచ్ఎంటి చినార్, హెచ్ఎంటి బేరింగ్స్ విభాగాలున్నాయి.
న్యూఢిల్లీ, జనవరి 6: రాబోయే బడ్జెట్లో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అంశంలో స్పష్టమైన ప్రణాళిక ఉండాలని దేశీయ పారిశ్రామిక రంగం ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం పారిశ్రామిక సంఘాలైన సిఐఐ, ఫిక్కీ అధిపతులు.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశాల్లో పాల్గొన్నారు.