S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

05/24/2016 - 00:23

ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఒక రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన బిజెపి అజేయంగా మారినట్లు కాదు, అదే విధంగా ఒకటి, రెండు రాష్ట్రాల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్ కనుమరుగైపోయినట్లు ఎంత మాత్రం కాదు. కాంగ్రెస్ ముక్త దేశం అంటూ బిజెపి చేస్తున్న ప్రచారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదు. అధికార పక్షంతోపాటు బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే దేశం బాగు పడుతుంది.

05/17/2016 - 06:47

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. తమ ప్రసంగాల్లో సహకార సమాఖ్య విధానానికి (కోఆపరేటివ్ ఫెడరలిజం) పెద్ద పీట వేసే మోది చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఇందుకు తాజా ఉదాహరణ ఉత్తరాఖండ్ రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారం, సుప్రీం కోర్టు అక్షింతలు వేయటం.

05/09/2016 - 23:36

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారనేది నానుడి. ఆగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో ముడుపులు పుచ్చుకున్న మన ఇంటి దొంగల్ని కూడా నానుడిలో చెప్పినట్లు పట్టుకోలేమా? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఇంటి దొంగల్ని వీలున్నంత త్వరగాపట్టుకుని నానుడి ఎల్లవేళలా నిజం కాదనేది నిరూపించగలుగుతారా? ఎందుకంటే ఇటలీలోని మిలాన్ నగరం కోర్టు హెలికాప్టర్ల కుంభకోణం నిందితులకు శిక్ష విధించింది.

05/03/2016 - 00:43

పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అధికార పక్షం ఉదార స్వభావంతో వ్యవహరించాలి తప్ప ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేయటం సమర్థనీయం కాదు. పార్లమెంటు బడ్జెట్ రెండో విడత మొదటి వారం సమావేశాల్లో ప్రతిపక్షం కంటే అధికార పక్షమే కొంచెం అతిగా వ్యవహరించిందని చెప్పకతప్పదు.

04/25/2016 - 23:36

న్యాయ వ్యవస్థ క్రియాశీలత (జుడీషియల్ యాక్టివిజం) శృతి మించి రాగాన పడుతోందా అనే అనుమానం కలుగుతోంది. నైనిటాల్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జోసెఫ్ ఉత్తరాఖండ్‌లో కేంద్ర ప్రభుత్వం విధించిన రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనం. న్యాయమూర్తి జోసెఫ్ విచారణ సంధర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీపై చేసిన వ్యాఖ్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

04/19/2016 - 00:42

కాశ్మీర్ మళ్లీ భగ,్భగ మండుతోంది. నిట్ గొడవ ఆ తరువాత బాలికపై అత్యాచారం ఫిర్యాదు వ్యవహారం కాశ్మీర్‌లో పరిస్థితి గొడవకు దారి తీసింది. కాశ్మీర్‌లో వేర్పాటువాదులు ప్రతి అంశాన్ని గొడవకు దారి తీయిస్తున్నారు. గోరంతను కొండంతలు చేయటాన్ని ఒక విద్యగా మార్చుకున్నారు.

04/12/2016 - 00:19

మన దేశంతో స్నేహం చేయటం,సత్సంబంధాలు నెలకొల్పుకోవటం పాకిస్తాన్‌కు ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యానికి ఎంత మాత్రం ఇష్టం లేదనేది మరోసారి రుజువైంది. పాకిస్తాన్ ఏకపక్షంగా శాంతి ప్రక్రియను నిలిపివేయటం ఇందుకు తాజా ఉదాహరణ. ఇష్టం లేనివారితో స్నేహం చేసేందుకు ప్రయత్నించటం వృధా ప్రయాసే అవుతుంది.

04/04/2016 - 23:28

రాజకీయ, ఆర్థికావసరాల కోసం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటం అత్యంత ప్రమాదకరం, భయంకరమైనదనేది అమెరికా, ఐరోపాతో చైనా కూడా గ్రహించటం మంచిది. మన దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా నిర్వీర్యం చేసేందుకు పాకిస్తాన్ ప్రధానంగా ప్రయోగిస్తున్న ఆయుధం ఇస్లామిక్ ఉగ్రవాదం. చైనా కూడా పరోక్షంగా ఇదే విధానాన్ని అవలంభిస్తోంది.

03/22/2016 - 00:30

భారత్ మాతాకీ జై నినాదాన్ని వివాదాస్పదం చేయటం వెనక మతపరమైన ఓటు బ్యాంకు రాజకీయ కుట్ర ఉన్నదనే అనుమానం కలుగుతోంది. భారత్ మాతా కీ జై అని నినదించేందుకు నిరాకరించటం వెనక రజాకార్ల మనస్తత్వం కనిపిస్తోంది. స్వాతంత్రానికి పూర్వం తెలంగాణాలో మారణ హోమం సృష్టించిన రాజాకార్లు మళ్లీ పడుతున్నారా?

03/15/2016 - 01:24

పార్లమెంటు ఉభయ సభల్లో గొడవకు గుడ్ బై చెప్పి చర్చలు జరిపేందుకు చేయి, చేయి కలిపిన అధికార ప్రతిపక్షం దేశ సమస్యలను మరింత లోతుగా విశే్లషించే స్థాయికి ఎదగాలి. గత మూడు,నాలుగు సంవత్సరాల నుండి అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీ రాజకీయాల కోసం పార్లమెంటు సమావేశాలను గొడవలు, గందరగోళానికి బలి చేయటం విదితమే. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడిగా, వేడిగా జరుగుతున్నా సజావుగా ముందుకు సాగుతున్నాయి.

Pages