S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

06/06/2017 - 00:14

ఏడు దశాబ్దాలుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మోదీ ప్ర భుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? పాకిస్తాన్‌తోపాటు మరికొన్ని దేశాలు అవలంబిస్తున్న మతపరమైన రాజకీయాలతో కాశ్మీర్ సమస్య అంత్యంత జటిలంగా మారింది. ఈ నేపథ్యంలో దీన్ని పరిష్కరించటం అనుకున్నంత సులభం కాదు.

05/30/2017 - 04:22

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజల సంక్షేమం కోసం పరితపించే వాడే నిజమైన నాయకుడు. ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ ఈ తరహాలో పనిచేస్తూ విజయపథంలో దూసుకుపోతున్నారు. భారత దేశానికి కొత్త నిర్వచనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ దానికి కార్యరూపం ఇచ్చేందుకు మోదీ దీక్ష వహించడం హర్షణీయం.

05/23/2017 - 08:29

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యా దవ్, కాంగ్రెస్ నాయకుడు కార్తి చిదంబరం నివాసాలపై ఇటీవల సిబిఐ జరిపిన దాడులు మరోసారి రాజకీయ నాయకుల అవినీతిపై చర్చకు తెరలేపాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుకోసమే తమపై దాడులు చేయిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం, లాలూ ప్రసాద్ ఆరోపించి అందరినీ విస్మయపరిచారు.

05/16/2017 - 00:54

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)ను అనుమానిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యం పరువుప్రతిష్టలను మంటగలిపాయి. ఎన్నికల్లో తాము గెలిచినపుడు ఇవిఎంలు ఎంతో మంచివనడం, ఓటమి చెందితే వాటిని ‘టాంపరింగ్’ చేశారని ఆరోపించడంతో ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి.

05/09/2017 - 09:03

మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న చైనా దూ కుడును అరికట్టలేమా? ఒకవైపు పాకిస్తాన్‌ను చైనా మన పైకి ఉసిగొల్పుతోంది. ఆక్రమిత కాశ్మీర్ గుండా పాకిస్తాన్ తీరంలోని ఓడరేవు వరకు భారీ రోడ్డును నిర్మిస్తూ మన దేశ సార్వభౌమాధికారాన్ని చైనా ప్రశ్నిస్తోంది.

05/02/2017 - 00:42

ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదం, నక్సలైట్ల ఆగడాలను అరికట్టటంలో ఎందుకు విఫలమవుతోంది? పెద్దనోట్ల రద్దు ద్వారా సీమాంతర ఉగ్రవాదం, నక్సలిజం నడ్డి విరిచామని ప్రకటించుకున్న బిజెపి ప్రభుత్వం అసలు లక్ష్యాన్ని సాధించలేకపోవటం ఆశ్చర్యకరం.

04/25/2017 - 07:07

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బి.జె.పి ఘన విజయాలు సాధిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనటంతో ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. బి.జె.పికి ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారం హస్తగతం కావటంతో ప్రతిపక్షాల అస్తిత్వం ప్రమాదంలో పడిపోయింది. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగుతున్నాయి.

04/18/2017 - 08:49

కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కాశ్మీర్‌ను కాపాడుకునేందుకు ఇప్పుడైనా గట్టి చర్యలు తీసుకొనకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. చైనా పాకిస్తాన్‌తో కుమ్మక్కై ఆక్రమిత కాశ్మీర్ మీదుగా గ్వాడర్ ఓడరేవుకు అతిపెద్ద రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోడ్డు నిర్మాణాన్ని కొనసాగనివ్వటమే భారత్ చేస్తున్న పెద్దతప్పు.

04/11/2017 - 00:46

సజావుగా సాగుతున్నాయని అంతా భావిస్తున్న తరుణంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల పరువును ‘శివసేన’ సభ్యులు బజారున పడేశారు. ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఒక అధికారిని ఇరవై నాలుగుసార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్‌కు మద్దతుగా ఆ పార్టీ సభ్యులు లోక్‌సభలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజుపై దాడికి యత్నించడంతో పార్లమెంటు పరువు పోయింది.

04/04/2017 - 00:21

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించినప్పటి నుండి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల్లో నీరసం ఆవహించింది. గతంలో ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ప్రతిపక్షాలు ఇప్పుడు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల్లో గతంలో కనిపించిన ఉత్సాహం, సమైక్యత, ఆత్మవిశ్వాసం ఇటీవల బాగా లోపించాయి.

Pages