S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

06/13/2016 - 04:49

దశాబ్దాలు గడుస్తున్నా భాషా పండితుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. హైస్కూళ్ళలో 6 నుండి 10 తరగతులు చెప్పడానికి తెలుగు, హిందీ మినహా అన్ని సబ్జెక్టులకూ స్కూల్ అసిస్టెంట్‌లను కేటాయించారు. కాని మాతృభాష తెలుగు జాతీయ భాష హిందీల వరకూ వచ్చేసరికి అవే 6 నుండి 10 తరగతులు బోధించడానికి స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్‌లుగా విభజించి రెండు పోస్టుల వారితో సమాన పనిని చేయిస్తున్నారు.

06/10/2016 - 23:57

ఈమధ్యన ఎమ్మెల్యేలు ఒక పార్టీలోనుంచి మరో పార్టీలోకి కప్పగెంతులు వేస్తున్నారు. అంటే వీరు ఒక విధమైన కప్పలన్నమాట. అసలు ఒక పార్టీలో ఇమడలేని వాడు మరో పార్టీలో ఇమడగలడా? అనేది ఆశ్చర్యమే. ఇది రాజకీయ వ్యభిచారం తప్పించి మరేం కాదు. ఈ కప్పగెంతుల్ని ప్రోత్సహించేది ముఖ్యమంత్రులే కావడం వల్ల ముక్కుమీద వేలు వేసుకోవాల్సి వస్తున్నది. ఇలా పార్టీలు మారేవాళ్లకు విలువేముంటుంది?

06/10/2016 - 05:37

ఎవాంజలిస్టుల మత అసహనానికి గుర్తుగా ఇటీవల కృష్ణాజిల్లా అంగలూరు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన దళితవాడలో రామాలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత సంతర్పణ జరిగింది. దీనికి దళితవాడకు చెందిన మతం మార్చుకొని క్రైస్తవులుగా మారిన వారిని ఫాస్టర్లు, సంతర్పణను బహిష్కరించాలని ఆదేశించారు. వారు దాన్ని తూ.చ.తప్పకుండా పాటించారు. ఇది క్రైస్తవంలోని పరమత అసహనానికి ప్రతీక.

06/09/2016 - 05:39

తెలుగు మహాసభల ఊసే లేదు. నానాటికీ తీసికట్టు నాగంభొట్టు అన్న చందంగా తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏం లాభం. ఎప్పుడు నిర్వహించే తెలుగు మహాసభల ఊసే లేదు. అదే పార్టీ సభలైతే ఘనంగా మండుటెండలో గాని హోరుమని జడివానలో గాని నిర్వహిస్తారు. పార్టీ సభలు ఆయా పార్టీల వారికే వారిని వీరు వీరిని వారు డప్పుకొట్టుకోవడమే. అదే తెలుగు మహాసభలైతే అందరికీ సంబంధించినవి. ఎంతో లాభదాయకం కూడా.

06/08/2016 - 04:12

రాహుల్‌కు పగ్గాలు అప్పచెబితే ఎలా ఉంటుందో ఎంవిఆర్ శాస్ర్తీగారు ఈ నెల 4న రాసిన ఉన్నమాటలో చక్కగా విశే్లషించారు. కాంగ్రెస్ లేని భారతం రాహుల్‌కి పట్టం కట్టగానే సంభవం అన్నది పచ్చి నిజమవుతుంది. మరి భాజపా వారికి కాంగ్రెస్ వైపునుండి ఏవిధమైన ప్రతిఘటన ఉండదు.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
మైనారిటీలుగా మారిపోతున్న హిందువులు

06/07/2016 - 00:42

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలనుంచి రూ.100 స్టాంప్ పేపరుపై ఒక అఫిడ విట్ తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఆదేశించడం విచిత్రం. ప్రతి ఎమ్మెల్యే తన అఫిడవిట్‌లో, తాను పార్టీ విప్‌ను ధిక్కరించబోనని, వేరే పార్టీలోకి ఫిరాయంచబోనని, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు విధేయులపై ఉంటానని పేర్కొనాలని సోనియా శాసించిందట.

06/06/2016 - 05:43

బ్రాండెడ్ అల్లోపతి మందుల ఖరీదు చాలా అధికమవడంతో వీటికి ప్రత్యామ్నాయంగా జనరిక్ మందులు అతి చవకగా మార్కెట్‌లోకొచ్చాయి. డాక్టర్లను జనరిక్ మందులనే ప్రిస్క్రైబ్ చేయమని ప్రభుత్వం సూచనలు చేసింది. అయినా డాక్టర్లు జనరిక్ మందులను రాయటం లేదు. పైపెచ్చు రుూ మందులు వాడితే కిడ్నీలు, లివర్ కాలక్రమేణా పాడైపోతాయని భయపెడుతున్నారు.

06/04/2016 - 07:25

ఒక అభిమాని రామకోటి లాగ నరేంద్ర మోదీ పేరు షేర్వాణీ నిండా వచ్చేట్టు నేయించి దాన్ని మోదీకి బహుమతిగా ఇస్తే మోదీ దాన్ని ధరించి తర్వాత వేలంలో దాన్ని అమ్మేసి ఆ సొమ్ము మహిళా సంక్షేమానికి విరాళంగా ఇచ్చేశారు. ఆ షేర్వాణీ ఐదారు లక్షలు ఖర్చుతో తయారైంది. దాంతో అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ బాబా మోదీ ప్రభుత్వం సూటూ బూటుప్రభుత్వం అని ఎద్దేవా చేయడం మొదలుపెట్టాడు.

06/03/2016 - 03:57

ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. ఇది జగత్‌సత్యం. మొత్తం భారతదేశంలో వున్న భక్తులకు కూడ ఆయన ఆరాధ్యుడే. టి.టి.డి. వారు ఎస్‌విబిసి పేరుతో పది సంవత్సరాల క్రితం భక్తి టి.వి.చానల్ ప్రవేశపెట్టారు. అనేక మంది సంతోషించారు. శ్రీవారి సుప్రభాతం ఇతర సేవా కార్యక్రమాలు మీ ఎస్‌విబిసి చానల్‌లో చూసి, విని ఆనందిస్తారని అనుకున్నారు. ముఖ్యంగా శ్రీవారి సుప్రభాత సేవను విని ఆనందించాలనుకున్నారు.

06/02/2016 - 05:55

నెనొక సన్నకారు, సామాన్య రైతును. నాకు ఉన్న కొద్ది పొలంపై (2ఎకరాల 60 సెంట్లు) అంబాజీపేట ఎస్‌బిఐలో9-12-2013న, రూ.97,000 పంటరుణాన్ని అరటి పంట నిమిత్తం తీసుకున్నాను. అప్పటి ప్రభుత్వం వారు ఉద్యావన పంటలకు రైతులకు రుణమాఫీ వర్తించదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వారు ఉద్యానవన పంటలకు కూడా రుణమాఫీ వర్తింపజేశారు. కానీ అర్హుడనైనప్పటికీ నాకు పంట రుణమాఫీ వర్తించలేదు.

Pages