S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/06/2018 - 00:00

గుంటూరు (లీగల్), జూలై 5: దుర్వ్యసనాలకు లోనై ఇంట్లోని నగదును తస్కరించి, ఇదేమని అడిగిన పాపానికి భార్యపై దాడిచేసి ఆమె మృతికి కారణమైన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ గుంటూరు మూడవ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సిరిపురపు శ్రీదేవి గురువారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం...

07/05/2018 - 23:59

గురజాల, జూలై 5: ఒక హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ గురజాల పదో అదనపు జిల్లా కోర్డులో జిల్లా జడ్జి ఎన్ సత్యశ్రీ గురువారం తీర్పు ఇచ్చారు. తీర్పు వెలువడిన కొద్దిసేపటికే కోర్టు ఆవరణ నుండి పోలీసుల కళ్ళుకప్పి ఒక నిందితుడు పరారయ్యాడు. దీంతో గురజాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

07/05/2018 - 23:57

కాకుమాను, జూలై 5: తన ప్రేమను తిరస్కరించిందన్న కోపం 17 ఏళ్ల మైనర్ బాలిక నోటిలో పురుగుమందు పోసి హతమార్చేందుకు యత్నించడమే కాక తాను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించి ఆసుపత్రిపాలైన యువకుడి సంఘటన కాకుమాను మండల పరిధిలోని చినలింగాయపాలెం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...

07/05/2018 - 23:29

గార్లదినె్న, జూలై 5 : మండల పరిధిలోని పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర (29) గురువారం పురుగుల మందు తాగి గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ రాంప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నాగేంద్ర కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేవాడు. బుధవారం రాత్రి కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన బంధువులు 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

07/05/2018 - 23:29

పెనుకొండ, జూలై 5 : మండల పరిధిలోని కియా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం రైలు ఢీకొనడంతో కియా కార్మికుడు దీపక్‌సింగ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. దీంతో మృతదేహం నుజ్జునుజ్జయింది. మృతుడి స్వగ్రామం గురుదాస్ జిల్లా గోవిందపుర్‌కు చెందినట్లు గుర్తించారు. రెండు నెలల క్రితం కియాలోని టీఎంఐ విభాగంలో పనిచేసేందుకు వచ్చాడు.

07/05/2018 - 23:28

గోరంట్ల, జూలై 5 : మండల పరిధిలోని ఎగువగంగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై సుధాకర్‌యాదవ్ తెలిపారు. దాసిరెడ్డిపల్లితండాకు చెందిన గోపీనాయక్ ద్విచక్ర వాహనంలో పాలు తీసుకుని గంగంపల్లిలోని పాలసేకరణ కేంద్రంలో ఇచ్చి గ్రామానికి తిరిగి వస్తూ మార్గమధ్యలో దాసిరెడ్డిపల్లితండాకు చెందిన నరసింహనాయక్‌ను వాహనంలో ఎక్కించుకున్నాడు.

07/05/2018 - 23:21

కొవ్వూరు, జూలై 5: కొవ్వూరు రోడ్ కమ్ రైలు వంతెన పైనుంచి గోదావరి నదిలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక యువతి దూకగా గల్లంతైనట్టు, ఆ యువతి రాజమహేంద్రవరానికి చెందిన సీహెచ్ బిందుగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బిందు, జంగారెడ్డిగూడెంనకు చెందిన వెంకటేశ్వరరావు ప్రేమించుకున్నారని పోలీసులు తెలిపారు.

07/04/2018 - 05:04

గుంటూరు, జూలై 3: జిల్లాలో సంచలనం రేకెత్తించిన సామూహిక అత్యాచార ఘటనను అర్బన్ పోలీసులు ఛేదించారు. నర్సుపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులను సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే కటకటాల వెనక్కు పంపారు. మంగళవారం అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

07/04/2018 - 05:02

గుంటూరు (పట్నంబజారు), జూలై 3: పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామ శివారులో గత నెల 26వ తేదీన జరిగిన అమానుల్లా హత్య కేసులో నిందితులైన కొప్పుల గోవిందస్వామి, పల్లపు శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు నిందితుల వివరాలను మీడియాకు వివరించారు.

07/04/2018 - 05:02

చేబ్రోలు, జూలై 3: ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం... సోమవారం రాత్రి రేపల్లె నుంచి గుంటూరు వైపు కారులో కె నాగమణి (35), కుమారుడు రోహిత్, భర్త సాయిగిరిధర్ వస్తున్నారు. మార్గమధ్యలో చేబ్రోలు-నారాకోడూరు మధ్య కారు అదుపుతప్పి చింతచెట్టును ఢీకొంది.

Pages