S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/06/2018 - 02:34

పాతబస్తీ, జూలై 5: నల్లబజారుకి తరలించడానికి సిద్ధంగా ఉన్న 2వేల కిలోల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ పోలీసులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని ఆంజనేయవాగు సెంటర్‌లో రెండు వాహనాల్లో 40 బస్తాల రేషన్ బియ్యం తరలించడానికి సిద్ధం చేశారని విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకి సమాచారం అందింది. దాంతో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు.

07/06/2018 - 01:12

పటన్‌చెరు, జూలై 5: వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పటన్‌చెరు మండలం బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. గుర్తు తెలియని భార్యాభర్తల మృతదేహాలు రింగ్ రోడ్డు డివైడరు వద్ద పడి ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు అందించిన ప్రకారం క్రింది విధంగా ఉన్నాయి.

07/06/2018 - 00:57

చౌటుప్పల్, జూలై 5: ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేసే యత్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని బోదనపు శే్వత (24) చికిత్స పొందుతూ ఐదు రోజులు మృత్యువుతో పోరాడి గురువారం మృతి చెందింది. బొడిగె భరత్ ప్రేమించమని వేధింపులకు గురి చేసి హత్య చేశారని మృతురాలి తండ్రి చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలలోకి వెళ్తే...

07/06/2018 - 00:54

కనగల్, జూలై 5: మండలంలోని ఎస్.లింగోటం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఎస్సై నర్సింహులుగౌడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రామ శివారులో రెండు లారీలలో అక్రమంగా తరలిస్తున్న 238 సబ్సీడీ గొర్రెలను పట్టుకున్నారు. లారీ డ్రైవర్లు పోలీసుల ప్రశ్నలకు సరియైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేయగా ఎస్సై వారిని పట్టుకొని సబ్సీడీ గొర్రెల అక్రమ రవాణా వివరాలను రాబట్టారు.

07/06/2018 - 00:46

ఆదిలాబాద్ రూరల్, జూలై 5: పట్టణంలోని డాల్డ కంపెనీ కాలనీలో గల జన్నింగ్ ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీఎత్తున నిల్వ ఉంచిన నిషేదిత గుట్కాను గురువారం పోలీసులు పట్టుకున్నారు.

07/06/2018 - 00:45

గుడిహత్నూర్, జూలై 5: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన నాలుగేళ్ళ చిన్నారిపై 14ఏళ్ళ మైనర్ బాలుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన సంఘటన గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ కాలనీకి చెందిన చిన్నారి బుధవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అదే కాలనీకి చెందిన మైనర్ బాలుడు బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకవెళ్ళి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.

07/06/2018 - 00:44

బెల్లంపల్లి, జూలై 5: పట్టణం రైల్వేస్టేషన్ ఏరియా 18వ వార్డుకు చెందిన కౌన్సిలర్ లింగంపల్లి రాములును కిడ్నాప్ చేసినట్టు కౌన్సిలర్ క్యాంపు నిర్వాహకుడు 21వ వార్డు మహిళా కౌన్సిలర్ మునిమంద స్వరూప భర్త రమేష్‌తోపాటు, వైస్ చైర్మన్ నూనెటి సత్యనారాయణ, కౌన్సిలర్లు చిట్యాల మధు, జిలకర వాసు, తోడే వంశీ కృష్ణారెడ్డిలపై కిడ్నాప్ కేసు నమోదు అయిందని బెల్లంపల్లి 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు.

07/06/2018 - 00:33

రోలుగుంట, జూలై 5: మండలంలోని నిండుగొండ జంక్షన్ వద్ద గురువారం తెల్లవారు జామున నాలుగు లక్షల రూపాయల విలువైన గంజాయి పట్టుబడింది. ఈసంఘటనలో ముద్దాయిల నుండి 80 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకుని కారును సీజ్ చేసారు. వారి నుండి నాలుగు సెల్‌ఫోన్లు, 33 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈసంఘటనకు సంబందించి ఎస్సై హరికృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.

07/06/2018 - 00:25

బద్వేలు, జూలై 5: కడప జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తిరిగి రెండో పెళ్ళికి సిద్దమవ్వడంతో ఏమీచేయలేని స్థితిలో ఆమె న్యాయ పోరాటం చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా ప్రేమించి నమ్మించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం తనను కాదంటున్నాడని ఆ యువతి పోలీసు స్టేషన్‌కు ఎక్కింది.

07/06/2018 - 00:20

గండేపల్లి, జూలై 5: దేవుని ప్రార్థనకు వెళ్లి మృత్యువాత పడిన భార్యాభర్తల ఉదంతమిది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. బుధవారం రాత్రి గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ముత్యాల ధనరాజు (61), అతని భార్య అనంతలక్ష్మి (58)లు ప్రార్థన కోసం నీలాద్రిరేవుపేట గ్రామానికి మోటారుసైకిల్‌పై వెళ్లారు.

Pages