S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/05/2020 - 02:12

హయత్‌నగర్, మార్చి 4: ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి నగదును అపహరించిన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ మదర్ డెయిరీ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం సెక్యూర్‌వాల్యు సిబ్బంది రూ.5.50లక్షలు జమచేసి వెళ్లారు. అప్పటికే అందులో కొంత నగదు ఉన్నట్లు తెలిపారు.

03/05/2020 - 02:09

సికిందరాబాద్, మార్చి 4: సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి బుధవారం ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ రావు(53) ఆసుపత్రిలోని రెండవ అంతస్తు నుంచి అకస్మాత్తుగా కిందకు దూకటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

03/05/2020 - 01:04

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు ఉరి శిక్షను అమలు చేసేందుకు ఉన్న అడ్డంకులన్నీ దాదాపుగా తొలగిపోయాయి. దీనితో వారి ఉరి అమలు కావడమే మిగిలింది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ నిర్భయ నాలుగో నింధితుడు పవన్‌గుప్త పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించటంతో నలుగురు ఏరరూప రాక్షసులకు ఉరి శిక్ష విధించేందుకు అన్ని అడ్డంకులు సంపూర్ణంగా తొలగిపోయాయి. దీనితో వీరిని ఉరి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది.

03/04/2020 - 04:58

అరకులోయ, మార్చి 3: ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం సంఘటన విశాఖ జిల్లా అరకులోయ మండలంలో సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధిత బాలికలలో ఒకరు మంగళవారం అరకులోయ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాలిక ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

03/04/2020 - 04:31

హైదరాబాద్, మార్చి 3: సచివాలయం కూల్చివేత వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ అనిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. ప్రభుత్వం విధాన నిర్ణయాలను తీసుకున్నపుడు అవి చట్టబద్ధంగా, సహేతుకంగా ఉన్నపుడు ఆ అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆయన చదివి వినిపించారు.

03/04/2020 - 04:29

హైదరాబాద్, మార్చి 3: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి మంగళవారం ఎసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బును అందజేస్తూ రేవంత్‌రెడ్డి దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితులు అంతా ఏసీబీ కోర్టులో హాజరయ్యారు.

03/04/2020 - 03:45

నెల్లూరు, మార్చి 3: న్యాయం వైపు నిలబడి కక్షిదారులకు న్యాయ స్థానంలో న్యాయం జరిగేలా చూడాల్సిన ఓ న్యాయవాది లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో మహిళకు అడ్వకేట్ లీగల్ ఎయిడ్‌గా ఉండమని లీగల్ సర్వీసెస్ అథారిటీ నియమిస్తే దీన్ని ఆసరాగా తీసుకొని తాను కేసు విషయంలో సహకరించాలంటే రూ.పది లక్షలు లంచం ఇవ్వాలంటూ కోరాడు.

03/04/2020 - 03:29

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసుల సమాచారాన్ని దాచినందుకుగాను విచారణ ఎదుర్కోవాలంటూ గత ఏడాది ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ ఆయన దాఖలు చేసిన విషయాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది.

03/04/2020 - 02:13

ఉయ్యూరు, మార్చి 3: జిల్లాలోని పలు ప్రాంతాలలో పార్కింగ్ చేసిన మోటారు సైకిళ్ళను దొంగిలించే నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేసి అతని వద్ద నుండి 40 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసు కమీషనరేట్ లా అండ్ ఆర్డర్ జోన్-1 డిసిపి వి హర్షవర్ధన రాజు స్థానిక పట్టణ పోలీస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలు వివరించారు.

03/04/2020 - 01:57

ఉప్పల్, మార్చి 3: గంజాయిని విక్రయిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద రూ.1.6లక్షల విలువైన 16 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Pages