S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరుణ్తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మాత రాజు రూపొందిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా ‘ప్రేమమ్’ చిత్ర హీరోయిన్ సాయి పల్లవి నటించనున్నారు. త్వరలో సెట్స్కు వెళ్లనున్న ఈ చిత్రం ఓ అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా రూపొందనుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ, శేఖర్ కమ్ముల ఓ మంచి కథ చెప్పారని, జూలై 25న ఈ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
‘రాణా’, ‘లక్ష్మీకల్యాణం’ చిత్రాలతో పరిచయమైన కాజల్, మగధీర చిత్రంతో టాప్ హీరోయిన్గా ఎదిగింది. దాదాపు కెరీర్ను ఇన్నాళ్లూ నెంబర్వన్ స్థానంలోనే గడిపిన కాజల్కు కష్టాలు మొదలయ్యాయి. ఆమె ఇటీవల నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ దగ్గర గలగలలాడడం లేదు. ఇక కాజల్ కెరీర్ ముగిసినట్లేనా, ఇక అంతేనా అన్నట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో పెన్ మూవీస్, ఇన్బాక్స్ పిక్చర్స్, బ్లాక్బస్టర్ స్టూడియో పతాకాలపై జయంతి లాల్గాడా, సాజిద్ ఖురేషి, సోహైల్ అన్సారి రూపొందిస్తున్న చిత్రం ‘నాగాభరణం’. దిగంత్, రమ్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
విజయ్కాంత్ కథానాయకుడిగా సెవెంత్ ఛానల్ సమర్పణలో బాలాజీ అందిస్తున్న చిత్రం ‘కాశీ విశ్వనాధ్’. ఉదయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, గతంలో విజయ్కాంత్ చిత్రాలలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని, కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో ప్రతి సన్నివేశం హైలెట్గా వుంటుందని తెలిపారు.
ముంబయినుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే నటనలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, గతంలో చెప్పింది చెప్పినట్లుగానే చేస్తోంది. అయితే ఆమెకు గుర్తింపు మాత్రం లేటుగా వచ్చినా నటనకు ఆస్కారమున్న పాత్రలే లభిస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్తో ‘కబాలి’ చిత్రంలో ఆమె నటిస్తోంది. గ్లామర్ను ఒలకబోయడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టదు.
‘బాహుబలి’ సీక్వెల్లో రోజుకొక కథానాయిక చేరుతోంది. ఇప్పటికే అనుష్క, తమన్నా మొదటి బ్యాచ్లో పరిచయమయ్యారు. ఇప్పుడు రెండో సగంలో రాణా భార్యగా శ్రీయ నటించనున్నట్లు ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే శ్రీయను ఎంపిక చేయలేదని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి.
నిజ జీవితానికి దగ్గరగా..
ఈ సినిమాలో నేను సూర్య అనే పాత్రలో నటించాను. నా నిజ జీవితానికి దగ్గరగా వుండే పాత్ర ఇది. అప్కమింగ్ పొలిటీషియన్ ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొంటాడు అనే విషయాలు ఈ సినిమాలో చర్చించారు. రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. డైరెక్టర్కు ఈ సినిమా కథపై పూర్తి క్లారిటీ వుంది. సెన్సార్ పూర్తిచేసుకుని సింగిల్ కట్ లేకుండా ‘యు’ సర్ట్ఫికెట్ పొందింది.
నిహారిక చాలా ఫ్రెండ్లీ
షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై బిపిన్, శ్రీహర్ష, లయన్ ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘బంగారు తెలంగాణా’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్లో జరిగింది.
‘ప్రేమికుడు చిత్రంలో శ్రీ పాత్రలో నటించాను. పట్నానికి వచ్చిన అతడు తన సమస్యలను ఎలా అధిగమించి హీరో అయ్యాడు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుంది’ అని కథానాయకుడు మానస్ తెలిపారు. ఎస్.ఎస్. సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, సునీల్రెడ్డి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమికుడు’. మానస్.ఎస్, సనమ్శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది.
హరీశ్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ పతాకంపై జయ.బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు రూపొందిస్తున్న భారీ చిత్రం ‘వైశాఖం’. ఈ చిత్రానికి సంబంధించిన కజకిస్తాన్ షెడ్యూల్ పూర్తిచేసి సినిమాను 60 శాతం ముగించారు. ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ, యూత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరంలో సూపర్హిట్గా నిలుస్తుందన్న నమ్మకం వుందని, అన్ని పాటలు అందరికీ నచ్చేలా వచ్చాయన్నారు.