S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/13/2018 - 02:04

న్యూఢిల్లీ, జూలై 12: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్రం పేర్కొంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న వ్యక్తి తప్పనిసరిగా ఆధార్‌ను కలిగివుండాలని గెజిట్‌లో పొందుపరిచారంటూ వార్తలు రావడంతో కేంద్రం దీనిపై వివరణ ఇచ్చింది.

07/13/2018 - 00:54

న్యూఢిల్లీ, జూలై 12: భారత దేశ చరిత్ర, ఔన్నత్యం, పురావస్తు ప్రాధాన్యత ఉన్న స్థలాల పరిరక్షణపై యువతలో అవగాహన పెంపొందించేందుకు పురావస్తు నిపుణులు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ ఆయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ధరోవర్ భవన్‌కు ప్రారంభోత్సవం చేశారు.

07/13/2018 - 00:52

పాట్నా, జూలై 12: బీజేపీతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, జేడీ(యూ), బీజేపీ మధ్య పొత్తు ఎంతోకాలం సాగదనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ వదంతులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెక్ పెట్టారు. బీహార్‌లో బీజేపీని పటిష్టం చేసే వ్యూహంలో భాగంగా గురువారం ఇక్కడకు అమిత్ షా వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షాను జేడీ(యూ) అధినేత, సీఎం నితీశ్ కుమార్ కలుసుకున్నారు.

07/13/2018 - 00:50

న్యూఢిల్లీ, జూలై 12: మహిళలు సామాజిక దురాచారాలపై రాజీలేకుండా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్థిక స్వావలంభన దిశగా మహిళలు వడివడిగా అడుగులు వేసేందుకు బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గురువారం ప్రధాని మోదీ దేశంలోని ఒక కోటి మంది మహిళా స్వయం సహాయక బృందాలతో నరేంద్ర మోదీ యాప్ ద్వారా మాట్లాడారు.

07/13/2018 - 00:47

ముంబయి, జూలై 12: బెంగళూరు పరిధిలోని ఆకాశంలో రెండు ఇండిగో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం నుం చి తృటిలో తప్పించుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 162మంది ప్రయాణికులతో వస్తున్న కోయంబత్తూరు-హైదరాబాద్ విమానం, 166మందితో ప్రయాణిస్తు న్న బెంగళూరు-కొచ్చిన్ విమానం మంగళవారం ఆకాశంలో 200 అడుగుల లంబంలో ప్రయాణించాయి.

07/13/2018 - 00:46

న్యూఢిల్లీ, జూలై 12: అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న 17 రాష్ట్రాల్లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు 1,100 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు కేంద్ర హోమ్‌శాఖ వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులు విడుదలైనట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. 61 గ్రామాల్లో అన్ని వౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

07/13/2018 - 00:57

న్యూఢిల్లీ, జూలై 12: భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు శశిథరూర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సింబిత్ పాత్రా డిమాండ్ చేశారు. గురువారం పాత్రా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే భారత దేశం ‘హిందు పాకిస్తాన్’గా మారిపోతుందంటూ శశిథరూర్ చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండించారు.

07/13/2018 - 01:15

న్యూఢిల్లీ: అవిభాజిత ఆంధ్రప్రదేశ్ ఆఖరు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఉదయం పనె్నండు గంటలకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

07/13/2018 - 01:16

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవన సముదాయాలు, ఇతర వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగానే రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుందని కేంద్ర న్యాయ శాఖ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది.

07/12/2018 - 16:46

పాట్నా: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గురువారంనాడు భేటీ అయ్యారు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి సుశిల్ కుమార్ మోదీ కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకాలు, అభిప్రాయ భేదాలపై చర్చించే అవకాశం ఉంది.

Pages