బ్యాంకర్లు లక్ష్యాలను అధిగమించాలి-కలెక్టర్
Published Friday, 23 September 2016కడప, సెప్టెంబర్ 22:జిల్లాలో రుతుపవనాలు వల్ల వర్షాలు బాగా కురుస్తుండటంతో ఈ ఏడాది ఇప్పటి వరకు రైతులు 1.75లక్షల హెక్టార్లలో పంటసాగు చేస్తున్నారని, బ్యాంకర్లు రైతులకు రుణాలందించడంలో లక్ష్యాలను 120 శాతం అధిగమించి సాధించాల్సిందిగా కలెక్టర్ కెవి సత్యనారాయణ బ్యాంకర్లకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ సిండికేట్బ్యాంక్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది వ్యవసాయ రంగంలో 43 శాతం వృద్ధిరేటు సాధించగలమన్నారు.