ట్రయల్ బౌట్పై జోక్యం చేసుకోండి
Published Sunday, 15 May 2016న్యూఢిల్లీ, మే 14: భారత్ నుంచి ఒలిపింక్స్కు రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఎవరు పోటీపడాలనే విషయంపై తలెత్తిన వివాదం ముదురుతోంది. నర్సింగ్ యాదవ్తో ట్రయల్ బౌట్పై జోక్యం చేసుకొని తనకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుశీల్ కుమార్ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా కాపీని పంపిన సుశీల్ తనకు ఒలింపిక్స్లో అవకాశం దక్కేలా చూడాలని కోడాడు. నర్సింగ్ యాదవ్తో ట్రయల్ బౌట్కు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం గెల్చుకున్న తర్వాత సుశీల్ పలు టోర్నీల్లో పాల్గొనలేదు. వివిధ కారణాలను పేర్కొంటూ అతను పోటీలకు గైర్హాజరవుతూ వచ్చాడు.