S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రయల్ బౌట్‌పై జోక్యం చేసుకోండి

న్యూఢిల్లీ, మే 14: భారత్ నుంచి ఒలిపింక్స్‌కు రెజ్లింగ్ 74 కిలోల విభాగంలో ఎవరు పోటీపడాలనే విషయంపై తలెత్తిన వివాదం ముదురుతోంది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్‌పై జోక్యం చేసుకొని తనకు అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుశీల్ కుమార్ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా కాపీని పంపిన సుశీల్ తనకు ఒలింపిక్స్‌లో అవకాశం దక్కేలా చూడాలని కోడాడు. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్ బౌట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం గెల్చుకున్న తర్వాత సుశీల్ పలు టోర్నీల్లో పాల్గొనలేదు. వివిధ కారణాలను పేర్కొంటూ అతను పోటీలకు గైర్హాజరవుతూ వచ్చాడు.

కొత్త అధ్యక్షుడి ఎన్నికకు 22న బిసిసిఐ సమావేశం

ముంబయి, మే 14: కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈనెల 22న సమావేశం కానుంది. శశాంక్ మనోహర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఆతర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి స్వతంత్ర హోదాగల చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. మనోహర్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి వచ్చే ఆదివారం బోర్డు సర్వసభ్య సమావేశం జరుగుతుంది. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ఏడు నెలలు పదవిలో ఉంటాడు. ఆతర్వాత రెండేళ్ల కాలానికిగాను అధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నిక జరుగుతుంది.

అది స్క్రిప్టయితే.. మరిదీ?!

వైఎస్సార్సీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయిస్తున్న శాసనసభ్యులంతా తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే వలస వెళుతున్నామంటూ ఒక కారణం చెబుతున్నారు. ఇక కొందరైతే జగన్ అంటే తమకు నేటికీ అభిమానం ఉందంటున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రం ‘జగన్‌తో కలిసి ముందుకెళ్లలేకపోతున్నాం.. కనీసం వారి ఇంట్లో కాఫీ కూడా తాగలేదం’టూ మరో అడుగు ముందుకేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు ‘జగన్ సిఎం అవుతారు. ఇప్పటి వరకు జరిగిన పరిపాలనలో లోపాలన్నీ సరిదిద్దుతారు.. చంద్రబాబుకు ముస్లింలు అంటే పొసగదు’ అని విమర్శించారు కదా అని విలేఖరులు అడిగితే, సమాధానానికి జలీల్‌ఖాన్ ఏమాత్రం తడముకోలేదు. ‘అబ్బే!

జైలే కోర్టు (భగత్‌సింగ్-28)

పరాయి ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా దేశవాసుల నిరసన ప్రకటించటానికి కదా భగత్ బృందం అన్నిటికీ తెగించి చట్టసభలో బాంబులు వేసింది? వారి తెగువను దేశం ఎలా చూసింది? దేశంలోని పెద్దలు, మేధావులు ఆ సాహసకృత్యానికి ఎలా స్పందించారు?
జాతీయ వీరులకు ఘన నీరాజనాలిచ్చే మాట దేవుడెరుగు. కనీసం ఒక మంచి మాటకే తెరువులేదు. చెయ్యకూడని పనిచేసి దేశానికి తలవంపులు తెచ్చారని తిట్టిపోసినవారే పెద్ద మనుషులు దాదాపు అందరూ.
భారతదేశంలో ఆ సమయాన నెంబర్ వన్ విలన్ భగత్‌సింగే!
దిక్కుతోచని గందరగోళంలో ఏప్రిల్ 8న వాయిదాపడ్డ సెంట్రల్ అసెంబ్లీ 11న మళ్లీ కొలువుదీరిన వెంటనే సభాపతి విఠల్‌భాయ్ పటేల్ లేచి -

ఎం.వి.ఆర్.శాస్ర్తీ

జగమంత కుటుంబం

‘ఏం చేద్దాం..? ఏం చేద్దాం..?
అనుకున్న మార్కులు రాలేదు...ఇంట్లో ఏమంటారో..?
చచ్చిపోవాలనిపిస్తోంది..!’
.. ఒత్తిడితో బాధ పడుతున్న ఓ యువతి ఆలోచనలు- ఆమెను భయం నుంచి మరణం వైపు లాక్కెళుతున్నాయి..
ఆ సమయంలో ఆమెకి కావల్సింది చక్కటి ఓదార్పు. ధైర్యాన్ని నింపే మాటసాయం.
అది ఎవరిస్తారు? తల్లి, తండ్రి లేదా అన్న.. చివరకి తాత లేదా అమ్మమ్మ.. ఎవరో ఒకరు...
***
ఒక మంచిమాట చెబితే చాలు- మనసుకు ఉపశమనం..
నా అన్నవారు నావెనుకున్నారన్న ధైర్యం..
మున్ముందు రాణించాలన్న స్ఫూర్తి.. బతుకుపై ఆశను కలిగిస్తుంది.
మార్కులు ఇవ్వని మార్పును మనసును తాకే మాట ఇస్తుంది..

-కృష్ణతేజ

ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్న తమిళ ఎన్నికలు

కల్తీసారా తాగి జనాలు చస్తున్నారని భావించిన ఎన్టీఆర్ గాంధీ జయంతినాడే సారాని నిషేధించాడు. దీనికి నాటి పీపుల్స్‌వార్ ఉద్యమం కారణం కాగా, దూబగుంట రోశమ్మ సారా వ్యతిరేక నినాదం ఊతాన్నిచ్చింది. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేసిన చంద్రబాబు సారా నిషేధంతో దొంగతనంగా కల్తీసారాను అమ్మడంతో తాగిన వారి ప్రాణాలు పోతున్నాయని అదే గాంధీ జయంతి రోజున భారతదేశంలో తయారైన విదేశీ మద్యం (ఐఎమ్‌ఎఫ్‌ఎల్) పేరుతో సారాప్యాకెట్లను పోలీసులచే అమ్మించడం ప్రారంభించాడు. ఇలా సారాకథలు రావిశాస్ర్తీగారి 3‘సారో’2కధల్లా ఎప్పుడూ ఎన్నికల నినాదంగా ఉంటూనే ఉన్నాయి.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162

గడ్డకట్టిన దినచర్య మారక తప్పదు

సంపద చేతిలో మనిషి మరణిస్తున్నాడు. సంపదని సృష్టించే మనిషిని చంపుతున్నాడు. అనారోగ్యకరమైన సంపదని సృష్టించడానికి అనాగరికతను పెంపొందిస్తున్నాడు.
మనిషి నైతికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఉన్నతంగా జీవించడమే నాగరిగత. మానవులందరూ ఒక దశలో సమానంగా, సమాజంలో సంతృప్తికరంగా జీవించడమే నాగరిగకత లక్ష్యం. నాగరిక సమాజం వెల్లివిరియడానికి ఇదే కారణం. బిచ్చగాళ్లు, ఆకలి చావులు, పేదరికం ఒకవైపు, అమోఘ సంపదలు మరోవైపు ఉంటే అది నాగరికత కాదు. ఆ రాజ్యం, ఆ దేశం దశని సాంస్కృతిక ఉచ్ఛస్థితిలో ఉన్నట్టుగా పేర్కొనలేం. ఇప్పుడు మనం నాగరికతలని సృష్టించలేకపోతున్నాం. అనాగరిక దేశాపాలనకే పరిమితం అవుతున్నాం.

రాజకీయ ఫోటోలు

‘‘బుగ్గ మీద చేయి పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ ఏంటీ విశేషం’’
‘‘అర్జంట్‌గా కథా రచయితను ఐపోవాలనుకుంటన్నాను. చేతిలో పెన్ను దీర్ఘాలోచనలో ఉన్నట్టు ముఖం పెట్టి ఫోటో దిగాలి. ’’
‘‘ఒకప్పుడు కథా రచయిత అంటే మాసిన గడ్డం, భుజాన సంచి, తెగిపోయిన చెప్పులు సింబాలిక్‌గా ఉండేవి. ఇప్పుడు కథ రాయడానికి సింగపూర్, హాంకాంగ్ వెళ్లే రోజులు వచ్చాయి. కథే ఉండని తెలుగు సినిమాకు కథ రాయడానికి సింగపూర్‌లు, హాంకాంగ్‌లు ఎందుకో? అర్థం కాదు ’’
‘‘ సినిమా కథ కాదు... నేను సీరియస్ కథలు రాయాలనుకుంటున్నాను.’’
‘‘ రాయాలనుకుంటే ముందు చదవాలి. ఫోటో కోసం ప్రాక్టీస్ ఎందుకు? ’’

ఇల్లు కట్టి చూడు

ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఒక మాట ఉండేది. నిజంగానే ఆ మాట ఇప్పుడు ఎవరూ అనడం లేదు. ఎవరి ఇల్లు వాళ్లే నిలబడి కట్టించుకునే కాలం ఒకటి ఉండేది. ఇప్పుడు పల్లెల్లో కూడా గుత్తేదార్లు అనే కాంట్రాక్టర్లు వచ్చి ఇల్లు కట్టి పెడతారు. లేదా వాళ్లే ముందు ఇల్లు కట్టి వాటిని అమ్ముతారు. ఒకప్పుడు ఈ సౌకర్యం లేదు. ఒకప్పుడు అసలు పద్ధతులే వేరు.

కె.బి. గోపాలం

బటర్ షేక్

అనాసపండ్ల ముక్కలు
- 2 కప్పులు
పంచదార - 1/2 కప్పు
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - చిటికెడు
ఐస్ ముక్కలు - కాసిన్ని
దానిమ్మ గింజలు -
1/2 కప్పు
తేనె - 1/2 కప్పు
పెరుగులో పంచదార, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తరువాత అనాసపండ్ల ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టాలి. చివరగా ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి తేనె, దానిమ్మ గింజలను వేయాలి. చల్లదనం కావాలనుకునే వారు ఐస్‌ముక్కలు వేసుకోవచ్చు.

వాణీ

Pages