-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
డబ్లిన్, మే 10: మాలాహైడ్లో శుక్రవారం జరిగే ప్రా రంభ టెస్ట్ మ్యాచ్లో దిగ్గజ పాకిస్తాన్ జట్టుతో ఐర్లాండ్ జట్టు తలపడనుంది. పాకిస్తాన్తో జరిగే ఈ మ్యాచ్లో తమకు పరాభవం తప్పదన్న సంగతి ఐర్లాండ్ కూనలకు తెలుసు. కానీ గతంలో పాక్ను మట్టి కరిపించిన చరిత్ర ఐర్లాండ్ టీమ్కు ఉంది. 2007 ప్రపంచకప్ పోటీల్లో పాకిస్తాన్పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన చరిత్ర ఐర్లాండ్కు ఉంది.
ముంబయి, మే 9: రానున్న ఆసియా గేమ్స్లో పతకం సాధిస్తామని ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లో ఇటీవల జరిగిన కామనె్వల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ విభాగం పురుషుల టీమ్కు గోల్డ్మెడల్ అందించిన జి.సత్తియన్ అన్నాడు. కామనె్వల్త్ గేమ్స్లో సాధించిన విజయంతో తమకు ఎంతో కలసి వచ్చిందని, త్వరలో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగే ఆసియా గేమ్స్లో సైతం ఇదే ఆటతీరును ప్రదర్శించి పతకం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
ముంబయి, మే 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ 11వ సీజన్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో లీగ్ దశలో మ్యాచ్లను మినహాయించి ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల సమయంలో మార్పులు చేస్తున్నట్లు ఐపీఎల్ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ప్రకటించాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల్లో ఈనెల 20వ తేదీ వరకు లీగ్ మ్యాచ్లు పూర్తవుతాయి.
న్యూఢిల్లీ, మే 9: ప్రస్తుత ఐపీఎల్ 11వ సీజన్లోని మొత్తం ఎనిమిది జట్లలో చిట్టచివరి స్థానంలో ఉన్న ఢిల్లీ డేర్డెవిల్స్ గురువారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్ కీలకం కానుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ ఢిల్లీ భవితవ్యాన్ని తేల్చేదే. ఈ నేపథ్యంలో మనుగడ సాధించాలంటే ప్రత్యర్థితో జరిగే ఫైట్లో చావోరేవో తేల్చుకోవాల్సిన బాధ్యత శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీపై ఆధారపడి ఉంది.
జైపూర్, మే 9: తమ జట్టులోని మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు విఫలం కావడంతోనే ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్లలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీమ్ కోచ్ బ్రాడ్ హడ్జ్ వ్యాఖ్యానించాడు. ఓపెనర్లుగా దిగుతున్న కేఎల్ రాహుల్, క్రిస్ గేల్ మంచి ఆటతీరును ప్రదర్శించి జట్టును ముందుకు నడిపిస్తుంటే వారికి అండగా ఉంటూ పరుగులను జోడించడంలో మిడిలార్డర్ విఫలమవుతున్నారని ఆయన పేర్కొన్నాడు.
సిడ్నీ, మే 9: ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆటగాళ్లను సిద్ధం చేసే నేషనల్ పెర్ఫార్మెన్స్ స్క్వాడ్ (ఎన్పీఎస్) కోచ్గా జాతీయ మాజీ కోచ్ డారెన్ లీమన్ నియమితులయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఉత్తర్వులు జారీ చేసింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న లీమన్కు తాజాగా కోచింగ్ బాధ్యతలు అప్పగించింది.
కోల్కతా, మే 9: ముంబయి మళ్లీ భారీ స్కోరు చేసింది. బుధవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 102 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కోల్కతా బౌలింగ్ను ఎంచుకోవడంతో బ్యాటింగ్కు దిగిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్ ఆడాడు.
ఇపుడు అందరి నోళ్లలోనూ సన్రైజర్స్ మాటే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుని, ఆ తర్వాత రెండు మ్యాచ్లలో ఓటమిపాలైనా అసంతృప్తి చెందలేదు. పడిలేచిన కెరటంలా అప్రతిహతంగా దూసుకుపోతోంది. మొత్తం ఎనిమిది టీమ్లు ఉన్నా, వీటిలో కొన్ని బలమైన జట్లు ఉన్నా, వెరవకుండా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో రాకెట్లా దూసుకుపోతోంది.
ముంబయి, మే 8: టీమిండియా త్వరలో జరుగనున్న వివిధ సిరీస్లలో పాల్గొనే జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.