-
విజయవాడ, నవంబర్ 8: రాష్ట్రానికి రావల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్
-
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలను చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ రోజ
-
తిరుపతి, ఫిబ్రవరి 5: శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గ
-
హైదరాబాద్, ఫిబ్రవరి 5: తెలంగాణలో కొనసాగసతున్న గ్రీన్ఛాలెంజ్కి విదేశీ క్రీడా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాష్ట్రీయం
హైదరాబాద్, జూన్ 17: ఇంజనీరింగ్ కాలేజీల్లో 41 కోర్సులను ఆఫర్ చేస్తున్నా విద్యార్థుల దృష్టి మాత్రం ఒకటి రెండు కోర్సులపైనే ఉంది. మంచి కాలేజీ , మంచి కోర్సు ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు మలుపుతిప్పే అనేక కోర్సులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రచారం పొందిన కోర్సుల్లో చేరేందుకే మక్కువ చూపుతున్నారు.
హైదరాబాద్, జూన్ 17: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి కులం, మతం అనే భేదాభిప్రాయాలు ఉండేవి కాదని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ప్రతికూలతలే ఆమెను ఉక్కు మహిళగా చేసి విజయం వైపు నడిపించాయని ఆయన పేర్కొన్నారు. ఉక్కు మనిషిగా ఇందిరా గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
హైదరాబాద్, జూన్ 17: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్ను పోలీసులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరచారు. ఈ మేరకు కోర్టు వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీతో వీరిద్దరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్ను ఏ1గా, రాజీవ్ను ఏ2గా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
విజయవాడ, జూన్ 16: తెలంగాణ విద్యుత్ బకాయిల వ్యవహారంపై కేంద్రానికి లేఖ రాయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు తెలిపారు. ఈ మేరకు ఈ అంశానికి సంబంధించి వాస్తవాలతో కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తామని తెలిపారు. సచివాలయంలో జెన్కో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, జూన్ 16: కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి అవసరమైన విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి ట్రాన్స్కో రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు జరిగిన పనులు, ఇక ముందు చేపట్టబోయే పనులపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ట్రాన్స్కో సిఎండి డి ప్రభాకర్రావు శుక్రవారం అందజేశారు.
నంద్యాల, జూన్ 16: నంద్యాల తెలుగుదేశం పార్టీలో మరో ముసలం పుట్టింది. శిల్పామోహన్రెడ్డి నిష్క్రమణ దెబ్బ నుంచి పార్టీ కోలుకోకముందే దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ముఖ్య అనుచరుడు ఎవి సుబ్బారెడ్డి సొంత కుంపటి రాజేశారు. గురువారం రాత్రి తన స్వగృహంలో రహస్య సమావేశం నిర్వహించి తన అనుచరులతో సంప్రదింపులు జరిపారు.
అమరావతి, జూన్ 16: రైతులు, కౌలు రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రుణ ఉపశమన పథకానికి సహకరించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన 199వ రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో రూ.1,66,806 కోట్ల విలువైన ప్రతిపాదనలతో రూపొందించిన 2017-18వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు.
హైదరాబాద్, జూన్ 15: దేశవ్యాప్తంగా ఎయిమ్స్ సంస్థల్లో ఎంబిబిఎస్ కోర్సులో చేరేందుకు నిర్వహించిన ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం వేకువ జామున రెండు గంటలకు విడుదల చేశారు. గుజరాత్ సూరత్కు చెందిన 18 ఏళ్ల నిషిత పురోహిత్ జాతీయ టాపర్గా నిలిచారు. దేశంలో అత్యధిక సంఖ్యలో పోటీ పడే ప్రవేశపరీక్షల్లో ఓకటైన ఎయిమ్స్ ఫలితాల కోసం అభ్యర్ధులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు.
హైదరాబాద్, జూన్ 15: షాహదత్ హజ్రత్ అలీ సందర్భంగా గతంలో ప్రకటించినట్టు ఈనెల 16కు బదులు 17 వ తేదీన కోర్టులకు సెలవు ఉంటుందని హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ హైకోర్టు పరిధిలో, ఎపి జ్యుడీషిల్ అకాడమీ సికిందరాబాద్, ఎపి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైదరాబాద్ నగరంలోని న్యాయస్థానాలకు సంబంధించిన కార్యాలయాలు ఈనెల 17న పని చేయవు.
ఖమ్మం, జూన్ 15: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ప్రతి పేదవాడి మోములో చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలలో ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు.