-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
జగిత్యాల, ఏప్రిల్ 17: ఇప్పుడే ముఖ్యమంత్రి కావాలన్న తొందరేమీ లేదు. మరో పదేళ్లపాటు కెసిఆర్ సిఎంగా ఉంటారని ఐటి, మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. జగిత్యాల బహిరంగ సభలో ప్రసంగించేందుకు వచ్చిన కెటిఆర్ ముందుగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కెసిఆర్ వయసు 64 ఏళ్లు. రాజకీయాల్లో 64 ఏళ్లు యంగ్ ఏజ్. కెసిఆర్ ఇప్పుడే తప్పుకోవలసిన అవసరం లేదు.
బాన్సువాడ, ఏప్రిల్ 17: నిజాబాద్ జిల్లా బాన్సువాడలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షల్లో చూచిరాతల పర్వం బాహాటంగానే సాగుతోంది. గైడులు ముందు పెట్టుకుని మరీ విద్యార్థులు సమాధానాలు రాస్తున్న చిత్రాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈనెల 17 నుంచి 27 వరకు ఓపెన్ పరీక్షలు జరుగనుండగా, తొలిరోజైన సోమవారం నుంచే చూచిరాతల పర్వం మొదలైంది.
హైదరాబాద్, ఏప్రిల్ 17: ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో బిల్లు ఆమోదించడం పట్ల బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. ఇదే అంశంపై బిజెపి నేతలు కూడా ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, బిజెపి గ్రేటర్ హైదరాబాద్ కమిటీలు వేర్వేరుగా హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించాయి.
కొత్తగూడెం, ఏప్రిల్ 17: సింగరేణి యాజమాన్యానికి వారసత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూసిన సుమారు 30వేల మంది నిరుద్యోగులను సుప్రీం కోర్టు నిర్ణయం నిరాశ పరిచింది. సింగరేణి యాజమాన్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి న్యాయ స్థాన నిర్ణయం చేదు అనుభవాన్ని మిగిల్చింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16: టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేరు ప్రతిపాదిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు వేరువేరుగా నామినేషన్ పత్రాలు అందజేశారు. టిఆర్ఎస్ ఎన్నికల అధికారిగా ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి తెలంగాణ భవన్లో ఆదివారం నామినేషన్ పత్రాలు అందజేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలోని పురాతన భవనాలు, ఆస్తులకు (హెరిటేజ్) సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నియమావళి, నిబంధనలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హెరిటేజ్ బిల్లును పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16: ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు విమానాలను హైజాక్ చేయాలన్న కుట్ర సమాచారం అందిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయ భద్రత సంస్థలకు అందిన సమాచారం మేరకు ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16: తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాలంటూ అసెంబ్లీ గేటు బయట బైఠాయించి నిరసన తెలిపి, రోడ్డుపైకి వస్తున్న టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుదలపై బిల్లును ఆమోదించేందుకు ఆదివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిగింది.
హైదరాబాద్, ఏప్రిల్ 16: బిసి రిజర్వేషన్లను 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశంలో రిజర్వేషన్ల బిల్లుపై ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచకుండా ఇతర రిజర్వేషన్లను పెంచడం పట్ల బిసిల్లోని 98 ఉప కులాల వారు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16: ముస్లిం రిజర్వేషన్లకు నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బిజెపి, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆదివారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ట్రాఫిక్ స్తంభించి, ఉద్రిక్తత చోటుచేసుకుంది.