-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్, ఏప్రిల్ 21: తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలుగా చేయడం వల్ల పరిపాలనను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్ళినట్లు అయ్యిందని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) తాజా నివేదికలో స్పష్టం చేసింది. శుక్రవారం బేగంపేట్లోని ‘సెస్’ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ చాన్సలర్ ప్రొఫెసర్ వైకె అలఘ్ ఈ నివేదికను ఆవిష్కరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుబంధం చేయాలని కేంద్రాన్ని కోరుతూ టిఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించడానికి కృషి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్ ఏ సీతారామారావుపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలని ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ హైకోర్టును కోరారు. ఈ కేసును జస్టిస్ ఏ శంకర్ నారాయణ విచారించారు. ఈ కేసులో సీతారామారావు అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి 2011లోనే రాజీనామా చేశారని, బోర్డు డైరెక్టర్లు ఫ్రాడ్కు పాల్పడినట్లు 2014లో బహిర్గతమైందన్నారు. పోలీసులు సీతారామారావుపై మూడు కేసులు నమోదు చేశారన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మహిళా రిజర్వేషన్ విధానాన్ని సరిగా అమలు చేయలేదని ఎస్టీ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని తెలియచేయాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది.
హైదరాబాద్/ నల్లగొండ, ఏప్రిల్ 21: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ల మధ్య గ్రూపుల గొడవలు పాత పద్ధతిలోనే సాగుతున్న తీరుకు శుక్రవారం హైద్రాబాద్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామక కసరత్తు భేటీ మరోసారి నిదర్శనంగా నిలిచింది.
హైదరాబాద్, ఏప్రిల్ 21: ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రసవాలు జరిగే హైదరాబాద్లోని సుల్తాన్బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలో గురువారం ఇద్దరు బాలింతలు మృతి చెందటం కలకలం సృష్టించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ మృతుల బంధువులు ఆందోళన చేశారు. గురువారం 19 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. ఇందులో ఇద్దరు బాలింతలు చనిపోయారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను తీపి మాటలతో మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. శుక్రవారం ఇక్కడ గాంధీభవన్లో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతులకు పంట ఉత్పత్తులపై గిట్టుబాటుధరలను కల్పించకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: కర్ణాటక రాష్ట్ర పరిధిలోని పర్లీ-వికారాబాద్ సెక్షన్లో కల్గూపూర్, భల్కీ రైల్వే స్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి ఔరంగబాద్-హైదరాబాద్ పాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనపై ద.మ.రైల్వే జిఎం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రపంచం అబ్బురపడేలా నిర్వహిస్తామని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం తెలిపారు. శుక్రవారం నాడు శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం ఉత్సవాల కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లుతో కలిసి పాత్రికేయులతో మాట్లాడారు. 26న వర్శిటీ ‘ఎ’ గ్రౌండ్లో ఉదయం 10.30 నుండి సాంస్కృతిక కార్యక్రమాలతో శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం అవుతాయని అన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: స్వచ్ఛ తెలంగాణ, క్రీడల అభివృద్ధి కావాలనే నినాదంతో ఈ నెల 27 నుంచి తలపెట్టిన 2000కె రన్ (2000 కిలోమీటర్ల పరుగు) మారథాన్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సాహస క్రీడాకారిణి కుమారి కొర నిఖిత ప్రభుత్వానికి, దాతలకు విజ్ఞప్తి చేశారు.