-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
కోరోనా వైరస్ సోకకుండా లక్షలాది మంది ఎయిర్ మాస్క్లను వాడుతుంటే, మొరాకోలోని మదినా ఆఫ్ రబాత్లో ఓ చిరు వ్యాపారి. పుదినా ఆకులతో మాస్క్ను తయారు చేసుకొని, దానినే ధరిస్తున్నాడు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఈ వైరస్ త్వరగా సోకుతుందని స్పష్టం చేస్తున్నారు.
ముంబయి, మార్చి 19: భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ)లో సెనె్సక్స్ 581.28 పాయింట్లు (2.01 శాతం) పతనమై 28,288.23 పాయింట్లకు పడిపోయింది. అదే విధంగా జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్ఎస్ఈ)లో నిఫ్టీ 205.35 పాయింట్లు (2.42 శాతం) తగ్గడంతో, 8,263.45 పాయింట్ల వద్ద ముగిసింది.
న్యూఢిల్లీ, మార్చి 19: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) షేర్ల ధర పతనం కొనసాగుతునే ఉంది. వరుసగా నాలుగో రోజైన గురువారం ఈ షేర్ల ధర సుమారు 8 శాతం పతనమైంది. గత 52 వారాల్లో ఎన్నడూ లేని రీతిలో అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈలో రిల్ షేర్ ధర 7.87 శాతం తగ్గి, 892.20 రూపాయలకు చేరింది. కొన్ని రోజులుగా రిల్ వాటాల అమ్మకం జోరు పెరిగింది. దీనితో కంపెనీ మార్కెట్ విలువ కూడా వేగంగా పతనం అవుతున్నది.
న్యూఢిల్లీ, మార్చి 19: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్)లో ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ తమ ఏర్లను స్వల్పంగా పెంచుకున్నారు. వారి ముగ్గురు పిల్లల వాటాలు కూడా పెరిగాయి. ప్రమోటర్ గ్రూప్ షేర్ హోల్డింగ్ కింద ప్రస్తుతం ఉన్న 47.45 శాతం ఆయిల్ టు టెలికాం వాటాల్లో ఎలాంటి మార్పు లేదని రెగ్యులేటర్ ఫైలింగ్లో దేవర్షి కమర్షియల్స్ ఎల్ఎల్పీ ప్రకటించింది.
న్యూఢిల్లీ, మార్చి 19: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి, దివాలాకు చేరువైనప్పటికీ, ఎస్బీఐసహా పలు బ్యాంకులు పెట్టుబడులకు ముందుకు రావడంతో కోలుకుంటున్న ఎస్ బ్యాంక్ ఇప్పుడు రేటింగ్స్ను కూడా మెరుగుపరచుకుంది. భారీ బకాయిలు, ఇతరత్రా సమస్యల కారణంగా ఇది వరకూ ఈ బ్యాంక్ను రేటింగ్ వాచ్ నెగెటివ్ (ఆర్డబ్ల్యూఎన్) కింద చేర్చారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు గత ఏడాది డిసెంబర్ నాటికి 93.89 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముం దు సంవత్సరంతో పోలిస్తే ఇది 3.2 శాతం అధి కం. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. పబ్లిక్ అకౌంట్ సహా కేంద్ర ప్రభుత్వం పేరిట తీసుకున్న రుణాలు గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 91,01,484 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఆనివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 18: భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్), టాటా గ్రూప్లు టెలికం డిపార్ట్మెంట్కు చెల్లించవలసి ఉన్న బకాయిలను తమకు తాముగా మదింపు చేసుకునే (సెల్ఫ్ అసెస్మెంట్) పేరిట భారీగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాయి.
ముంబయి, మార్చి 18: కరోనా వైరస్ భయం నుంచి ప్రపంచ మార్కెట్లు ఇంకా బయటపడలేదు. మదుపరులు ముందుజాగ్రత్త చర్య లు తీసుకుంటున్న కారణంగా స్టాక్ మార్కెట్లకు భారీ నష్టా లు తప్పడం లేదు. అంతర్జాతీయ సూచీలు కూడా నిరాశాజనకంగా ఉండడంతో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఆటుపోట్లకు గురయ్యాయి.
న్యూఢిల్లీ, మార్చి 18: రక్షిత ముసుగులు, చేతి తొడుగులు, చేతుల శానిటైజర్ల తయారీదారులు, దిగుమతిదారులు తమ వద్ద ఉన్న నిల్వల గురించి సాయంత్రం 6గంటలలోగా సమాచారాన్ని అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జాతీయ ఔషధ ధరల అథారిటీ (ఎన్పీపీఏ) హెచ్చరించింది.
ముంబయి, మార్చి 18: మూలధన మార్కెట్ నుంచి డబ్బును సేకరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ కాని ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడంతో, వారి నిధుల అవసరాలు తీర్చడానికి బ్యాంకులపై ఎక్కువ ఆధారపడుతున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు రుణాలు ఇవ్వడం ద్వారా ఏడాదికి పైగా 34.7 శాతం పెరిగిందని ఒక నివేదిక తెలిపింది.