S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

01/31/2019 - 19:42

తెలుగు సాహితీ జగత్తులో చిరస్థాయిగా, స్థిర స్థానాన్ని సుస్థిరపర్చుకొన్న కొద్దిమంది కథకుల్లో కీ.శే. మల్లాది రామకృష్ణశాస్ర్తీ గారిదే ప్రథమ తాంబూలం!
అలనాడు అల్లసాని వారు చెప్పుకొన్నట్లుగా, ‘‘నిరుపహతి స్థలంబు రమణిప్రియ దూతిక తెచ్చి యిచ్చు కప్పుర నిడె మాత్మ’’ లాంటి సరంజామా ఉంటేనే కాని-కథ వ్రాయనని భీష్మించుక్కూర్చోలేదు శాస్ర్తీగారు.

01/30/2019 - 19:01

ఆ చతురకతే ఒకో సందర్భంలో ఓడిపోవాల్సొచ్చినా ఆ ఓటమిలోనే గెలుపు వెతుక్కుంటూంటాడు భర్త వెంకట్రావు. మొండివాదన కథలో బందరు నుండి ఒంగోలుకు పోయే దోవలో గుంటూరు తగలకపోయినా ‘ఆ!తగలకేం లెండి. ఇష్టమైతే బాగానే తగులుతుంది’ అని సూటీ పోటీ బాణమేసి మొత్తానికి వాళ్ల వాళ్లకి ఆవకాయ బుట్ట పంపగలిగే చతుర నారీమణి కాంతం. కనె్నకాంతం ప్రౌఢ కాంతంగా మారేసరికి ఐదుగురు పిల్లలు.

01/29/2019 - 19:51

తెలుగు సాహిత్యంలో కాంతం పుటక అదీ. అక్కణ్ణిచీ భార్యాభర్తల సరాగాలూ, అనురాగాలూ, పంతాలూ, పట్టింపులూ, ఇరువురి జయాపజయాలూ వగైరాలమీద బోలెడు కథలు. అన్నిటా ఆవిష్కరింపబడే ఒకే ఒక విషయమేమిటంటే వెంకట్రావు అంటే కాంతం భర్త ఎంత వ్యక్తిత్వం వున్నా దాన్ని ప్రదర్శించడానికి వీలులేనపుడు సామరస్యంతో వెనక్కి తగ్గుతుంటాడు. ఏతావతా కాంతందే పైచేయి అవుతూంటుంది.

01/28/2019 - 21:57

పురుషులందు పుణ్యపురుషులు వేరయినట్లు, నామధేయులందు సార్థక నామధేయులు వేరుగా ఉంటారు. మునిమాణిక్యం ఇటువంటి రెండో కోవకు చెందినవారు. ఆయన ఇటు సాంసారిక జ్ఞానానికి ముని, అటు హాస్యానికి మాణిక్యం గూడాను. నటుల్లో ఇంగ్లీషువారికి పాల్‌ముని ఎటువంటివాడో రచయితల్లో తెలుగువారికి మన హాస్యముని అటువంటివాడు.

01/27/2019 - 22:38

‘‘ఆ వూరు రైతాంగం అంతా కమ్మవారు. రెండొందలు పైగా వుంటుంది గడప. ఊరిపెత్తనం వారిదే’’. తతిమ్మా కులాల వాళ్లు శెట్టి బలిజలు, కలారీలు కొప్పు వెలమలు, చాకళ్లూ, మంగళ్లూ.. బాగా తక్కువేగాని మాదిగపల్లెలో యాభైదాకా వున్నాయి కొంపలు.

01/25/2019 - 18:38

వారి కథలలో మతాంతీకరణను వ్యతిరేకించే అస్పృశ్యతను ఖండించే కథలెన్నో వున్నాయి. బ్రాహ్మణ అగ్రవర్ణాలు మాత్రమేనా ఆయనకు కథా వస్తువు? కాదు కాదు తెనుగు జాతి యావత్తూ ఆయన రచనా పరిధి.

01/24/2019 - 19:55

1925 తరువాత ఆయన సంఘంలోని పాత్రల సంభాషణలను యధాతథంగా టేపు రికార్డు చేసి వినిపిస్తున్నారా? అన్నంత సహజంగా నాటకీయంగా రాస్తూ కథలు తయారు చేశారని చెప్పుకున్నాం కదా! ఈ సందర్భంలో వారే స్వయంగా ఒక చోట చెప్పిన ఉదంతం చెబుతాను. రాయవరం నుంచి వచ్చే రెడ్డిరాణి పత్రికకు శాస్ర్తీగారిని కథలు రాయమనడం అబ్బురం కాదు. చాలా కథలు ఆయన అందులోనే రాశారు. ‘‘శాస్ర్తీగారూ!

01/23/2019 - 19:57

కానీ, దాన్ని తెగేసి ప్రోత్సహిస్తూ శ్రీపాదవారు జూనియరూ కాదు, అల్లుడు అన్న కథ రాశారు. తహస్సీలుదారు గాదు -వర్తకుడు, వెలుగు-చీకటి నలుగుర్ని పోషిస్తున్నానిప్పుడు అన్న కథలు పాఠకులలో స్వతంత్ర వృత్తిమీద ఆసక్తిని, గౌరవాన్ని కూడా పెంపొందించాయని నాటికీ నేటికీ విజ్ఞులు వక్కాణిస్తున్నారు. వీరేశలింగం పంతులుగారు అన్నా, బంకించంద్ర ఛటోపాధ్యాయగారు అంటేనూ శాస్ర్తీగారికి చెప్పనలవిగాని యిష్టం.

01/22/2019 - 20:04

‘‘రాయగా రాయగా భాష స్వాధీనమవుతుంది. రాయగా రాయగా క్రాంత దర్శిత నిశితం అవుతుంది, రాయగా రాయగా తపస్సు సిద్ధించి మహర్షి అవుతావు. మహర్షి కానివాడు, కథలు రాయలేడు’’ అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ గారు. ఇంగ్లీషు వాసనలంటని అసలుసిసలు తెనుగు జాతీయ కథా రచయిత ఆయన. ఆయనదొక విశిష్ట మూర్తిమత్వం. భాష, భావం, పాత్రల ప్రవృత్తీ, అన్నింటా నూటికి నూరుపాళ్లూ తెనుగుదనం జొప్పించిన స్రస్ట, ద్రష్ట కూడా ఆయన.

01/21/2019 - 19:02

ఈ బృహత్తర మహత్తర ప్రజా, రైతాంగ పోరాటాన్నీ దాని ఫలితాలనూ చిత్రించిన నవలలు కొద్ది సంఖ్యలోనే అయినా వెలువడ్డాయి. ఆ పోరాట ఫలితంగా అప్పటికీ ఇప్పటికీ తెలంగాణకు చెందిన రచయితలలోనే సామాజిక స్పృహ కానవస్తుంది. ఆ పోరాట ఫలితంగా జన జీవితంమీద ఏర్పడ్డ గాయాల ప్రభావం ఇంకా అక్కడి రచయితలపై ఉన్నట్టే అనిపిస్తుంది.

Pages