S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, డిసెంబర్ 2: రెండు రోజుల పాటు జరుగునున్న హెచ్టి లీడర్షిప్ సమ్మట్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. భారత దేశానికి కావాల్సిన మార్పులు అన్న అంశంపై జరుగునున్న సమ్మిట్లో పాల్గొంటున్న 21 మంది ప్రముఖుల్లో చంద్రబాబు ఒకరు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: గోదావరి జిల్లాల్లో ఒఎన్జిసి, గెయిల్ గ్యాస్ పైప్లైన్ల్ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టాలని కేంద్రానికి టిడిపి ఎంపీ తోట నరసింహం విజ్ఞప్తి చేశారు. లోక్సభ జీరోఅవర్లో ఈ అంశాన్ని లేవనేత్తారు. గెయిల్, ఒఎన్జిసి పైప్లైన్లు అనేక సార్లు పగిలిపోయి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.
విశాఖపట్నం, (స్పోర్ట్స్) డిసెంబర్ 2: అఖిల భారత పోలీస్ క్లస్టర్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పురుషుల, మహిళల జట్లు హ్యాండ్బాల్ టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. శుక్రవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా సాగిన హ్యాండ్బాల్ ఫైనల్ పోటీలో ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు 34-31 గోల్ల తేడాతో సిఆర్పిఎఫ్ జట్టును ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
హైదరాబాద్, డిసెంబర్ 2: తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పంతం వెంకటేశ్వరావు (నానాజి)ను ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నియమించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని రఘువీరా ఆయనకు సూచించారు.
సబ్బవరం, డిసెంబర్ 2: రెండు లక్షల రూపాయలకు కన్న పేగు బంధం అమ్ముడుపోయింది. పొత్తిగుడ్డల మధ్య వెచ్చని తల్లిఒడిలో పాలు తాగాల్సిన పసికందు సంతానం లేని ఓ కుటుంబానికి తరలిపోవాల్సి వచ్చింది. సంచలనం కలిగించిన ఈ సంఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం వెదుళ్ళనరవ బిసి కాలనీలోశుక్రవారం చోటు చేసుకుంది.
హైదరాబాద్, డిసెంబర్ 2: ప్రధాని నరేంద్ర మోదీ కన్ను మహిళల మంగళ సూత్రాలపై పడిందని ఎపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. మహిళల జోలికి వెళితే ఎన్డీయే భస్మం అవుతుందని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హెచ్చరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 2: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలన్న ప్రజల ఆకాంక్షను అసెంబ్లీలో వినిపించామే తప్ప తాము ఎవరినీ అగౌరవపరచలేదని, ఎటువంటి తప్పు చేయలేదని వైకాపా ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ప్రివిల్లేజస్ కమిటీ ముందు తన వాదనను వినిపించారు.
జిన్నారం, డిసెంబర్ 2. ఐరన్ పరిశ్రమలో ఫర్నెన్స్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన సంఘటన జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని విజయా ఐరన్ పరిశ్రమలో చోటు చేసుకుంది. శుక్రవారం మూడవ షిఫ్టులో విధులు నిర్వహిస్తూ ఉండగా పరిశ్రమలోని ఫర్నెస్ సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో ఫర్నెస్లోని లిక్విడ్ ఐరన్ విధులు నిర్వహిస్తున్న కార్మికులపై పడింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 2: జిఎస్టి బిల్లులోని వ్యవసాయదారుల జాబితాలో కౌలుదారులను చేర్చాలని కేంద్రానికి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఆధ్యక్షతన శుక్రవారం నాడు జరిగిన జిఎస్టి కౌన్సిల్ ఐదవ సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారీ పరిమాణంలో ద్రవ్య రూపంలో నగదు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.