S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/28/2019 - 03:23

ముంబయి, జూన్ 27: మరాఠాలకు విద్య, ఉపాధిలో ప్రత్యేక కోటా కల్పించడాన్ని బాంబే హైకోర్టు గురువారం సమర్ధించింది. అయితే 16 శాతంగా పెంచిన కోటాను 12 లేదా 13కు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతీ డాంగ్రేతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ మరాఠా రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది.

06/28/2019 - 02:03

ఉప్పల్, జూన్ 27: ఆటో డ్రైవర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్, చిలుకానగర్, న్యూ రామ్‌నగర్‌లో నివాసముండే సింగిశెట్టి ఉదయ్ శంకర్ (23), గంజి శ్రీకాంత్ (33) బంధువులు. సికింద్రాబాద్, తుకారామ్‌గేట్ సాయినగర్‌లో నివాసముండే ఆటోడ్రైవర్ మెరుగు సాయి ప్రసాద్ (23) వీరికి బంధువు.

06/28/2019 - 02:03

హైదరాబాద్, జూన్ 27: నగరంలో బిట్ కాయిన్ పేరుతో దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. ధిల్లీకి చెందిన అశీష్ మాలిక్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బిట్ కాయిన్ పేరుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుమారు 52 కోట్లకు పైగా దుండగులు వసూళ్లకు పాల్పడ్డారు. నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు.

06/28/2019 - 02:02

మహేశ్వరం, జూన్ 27: భారీ అవినీతి అక్రమార్జనకు పాల్పడుతూ లక్షల రుపాయలు దండుకుంటున్న మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ దేవులపల్లి సంగీత గురువారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రెవెన్యూ చట్టాలలోని లొసుగులను ఆధారం చేసుకొని డాక్యుమెంట్ రైటర్ల మధ్యవర్తిత్వంతో క్రయవిక్రయదార్లను భయబ్రాంతులకు గురి చేస్తూ అనునిత్వం భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్న సబ్ రిజిస్ట్రార్ సంగీతను పట్టుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

06/28/2019 - 01:47

కామారెడ్డి, సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం వద్ద గల 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున 6 గంటల ప్రాంతం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండున్నర సంవత్సరాల బాలునితో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. సదాశివనగర్ ఎస్‌ఐ.

06/28/2019 - 01:22

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మల్కాజ్‌గిరి ఎంపీ , కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కట్టడం కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఆయన పిటీషన్‌లో పేర్కొన్నారు.

06/28/2019 - 00:41

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలు ఎదుర్కొని జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ గురువారం బెయిల్‌పై విడుదలయ్యారు. హత్య జరిగిన రోజు వీరు అక్కడి సాక్షాలను తారుమారు చేశారన్న అభియోగంపై పోలీసులు వీరిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. వివేకా హత్య జరిగి 90 రోజులు గడిచినా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు.

06/27/2019 - 03:58

హైదరాబాద్, జూన్ 26: ప్రముఖు వ్యక్తుల ఫోటోలను, వారి పేర్లను అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్న ఒక షాపు యజమానికి రూ. 7 వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సుల్తాను బజార్‌లో హేమంత్ శారీ స్టోర్‌పై హీరోయిన్ శృతి ఫొటోను వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఉస్మానియా వర్సిటీ విద్యార్థి తెలంగాణ ఫోరానికి ఫిర్యాదు చేశాడు.

06/27/2019 - 01:41

విజయవాడ (క్రైం), జూన్ 26: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తతోపాటు మరో మహిళకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం చిట్టినగర్ లంబాడీపేటకు చెందిన జక్కా పద్మజాకు నరేష్‌కుమార్‌తో ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. భర్త బంగారం పని చేస్తుంటాడు. భార్య ప్రైవేటు స్కూలులో టీచర్.

06/27/2019 - 01:40

పెనమలూరు, జూన్ 26: స్థానిక దళితవాడలో ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. సంపంగి రమేష్‌తో రమాదేవికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. అత్త మరియమ్మ, ఆడపడుచు లత వారి కుటుంబ సభ్యులు. మంగళవారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై తన భార్య రమాదేవి మృతి చెందినట్లు రమేష్ బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Pages