S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తమిళంతో పాటు తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ భిన్నమైన సినిమాలతో అలరిస్తూనే వున్నాడు. తాజాగా ఆయన నటించిన తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా హీరో విశాల్ చెప్పిన విశేషాలు..
మంచి పేరు తెచ్చిపెట్టింది..
సుధీర్బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన నటించిన ‘శమంతకమణి’ మంచి విజయం సాధించడంతో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైన్గా తెరకెక్కే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నదట. ఈ చిత్రంలో సుధీర్ సరసన కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందని దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.
శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగేష్ మాకం దర్శకత్వంలో ఎం.ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘బిలాస్పూర్ పోలీసుస్టేషన్’. పోలీసు నేపథ్యంలో తెరకెక్కిన థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాసులు వివరాలు తెలియజేస్తూ- ఎంటర్టైనింగ్గా వుంటూనే థ్రిల్ కలిగించే చిత్రమిది.
తాజాగా ‘జై లవకుశ’ విజయం తో జోరుమీదున్నాడు ఎన్టిఆర్. ఈ చిత్రం తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే ఈ చిత్రం కోసం ఎన్టిఆర్ సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. అదేమిటంటే- ఇందులో ఎన్టిఆర్ డిటెక్టివ్గా కనిపిస్తాడని సమాచారం.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం- 1985’ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో వేసిన విలేజ్ సెట్లో జోరుగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రంగస్థలం అనే గ్రామంలో 1985లో జరిగిన కథతో రూపొందుతుందట. దానికోసం ఆనాటి పరిస్థితులకు సంబంధించిన సెట్ కూడా వేసారు. భిన్నమైన కథాకథనాలతో సాగుతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సందీప్కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చక్రి చిగురుపాటి రూపొందించిన చిత్రం కేరాఫ్ సూర్య. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 10న విడుదలకు సిద్ధం చేసారు.
సప్తగిరి, సోనాక్షివర్మ జంటగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో, డాక్టర్ రవికిరణ్ రూపొందించిన చిత్రం ‘సప్తగిరి ఎల్ఎల్బి’. ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
మంచు మనోజ్ కథానాయకుడిగా పద్మజా ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఈ చిత్రాన్ని ఈనెల 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు.
విభిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా. నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకున్న ఆండ్రియా తాజాగా విశాల్ సరసన ‘డిటెక్టివ్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా ఆండ్రియా చెప్పిన విశేషాలు- థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం చాలా కొత్తగా వుంటుంది. తమిళంలో ఘనవిజయం సాధించడంతో తెలుగులో కూడా హిట్టవుతుందన్న నమ్మకముంది.
కార్తికేయ, సిమ్రత్ ప్రధాన పాత్రలలో రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్.గుమ్మడికొండ రూపొందించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 17న విడుదలకు సిద్ధం చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు రిషి మాట్లాడుతూ, కెమెరా విజువల్స్ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, ఫీల్గుడ్ మూవీగా రూపొందించామని అన్నారు.