S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/18/2016 - 07:06

న్యూఢిల్లీ, జనవరి 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన అంకుర పరిశ్రమల విధానం (స్టార్టప్)లో పలు లోపాలున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ విమర్శించారు. ఈ విధానాన్ని యుపిఏ ప్రభుత్వ హయాంలోనే అమలుచేయటం జరిగిందని, గతంలో అమలైన విధానాన్ని నరేంద్ర మోదీ కొత్తగా కనుగొన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

01/18/2016 - 07:01

న్యూఢిల్లీ, జనవరి 17: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై ఒక యువతి సిరా దాడికి పాల్పడింది. ఢిల్లీ రోడ్లపైకి ఒకరోజు సరి సంఖ్య గల వాహనాలను, మరో రోజు బేసి సంఖ్య గల వాహనాలను అనుమతిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం విజయవంతం కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు తెలియడానికి ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది.

01/18/2016 - 06:57

న్యూఢిల్లీ, జనవరి 17: భారత్-పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కంచెలేని చొరబాట్లకు అవకాశాలున్న ప్రాంతాల్లో త్వరలోనే లేజర్ గోడలను ఏర్పాటు చేయనున్నారు. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ వైపునుంచి టెర్రరిస్టు చొరబాట్లను పూర్తిగా అరికట్టడానికి ఇలాంటి గోడలను నిర్మించాలని హోం మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

01/18/2016 - 06:49

న్యూఢిల్లీ, జనవరి 17: భారతీయులది ప్రకృతితో మమేకమైన సమాజం, ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి సమాజం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సంక్రాం తి సందర్భంగా తమ నివాసంలో ఏర్పాటు చేసిన సంబరాలకు హాజరైన మోదీ తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులు తన జీవితాలను క్యాలెండర్‌తో ముడిపెట్టుకోకుండా ప్రకృతితో పెనవేసుకున్నారని మోదీ తెలిపారు.

01/18/2016 - 06:11

న్యూఢిల్లీ, జనవరి 17: రోడ్లపై పొగలు చిమ్ముతూ ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారడమేకాకుండా, కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమవుతున్న కాలం చెల్లిన వాహనాలకు ఇక చెల్లు చీటీ తప్పదేమో! కాలుష్య కారకాలయ్యే కాలం చెల్లిన వాహనాలకు చెల్లు చీటీ పలికే ఒక పథకాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

01/17/2016 - 08:30

న్యూఢిల్లీ, జనవరి 16: స్టార్టప్‌ల విషయంలో భారత్ ఆలస్యంగా నిద్ర లేచిందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అయితే గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసినందున ఈ ఆలస్యానికి తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. చిన్న పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణాన్ని కల్పించడం గురించి రాష్టప్రతి మాట్లాడుతూ, ‘ఈ జాప్యానికి బాధ్యతను నేను ఎవరిమీదకో నెట్టలేను.

01/17/2016 - 06:57

ముంబయి, జనవరి 16: సంజయ్ లీలా బన్సాలీ తీసిన ‘బాజీ రావ్ మస్తానీ’ చిత్రం ఈ ఏడాది ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సగం అవార్డులను ఎగరేసుకు పోయింది. శుక్రవారం రాత్రి ప్రకటించిన అవార్డుల్లో ఆ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమగాయని ఉత్తమ కొరియోగ్రాఫీ సహా మొత్తం తొమ్మిది అవార్డులను దక్కించుకుంది. కాగా, ‘పికు’ చిత్రంలో నటనకు గాను దీపికా పదుకోనెకు ఉత్తమ నటి అవార్డు లభించింది.

01/17/2016 - 06:09

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శశి థరూర్ భార్య సునందా పుష్కర్‌ది సహజ మరణం కాదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్.బస్సీ చెప్పారు. అయితే ఆమె శరీరంలో ఎలాంటి రేడియోధార్మిక పదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా పరీక్షల్లో తేలలేదని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ఆయన ఈ విషయం చెప్పారు.

01/17/2016 - 06:06

న్యూఢిల్లీ, జనవరి 16: దేశంలో నూతన ఆవిష్కరణల వ్యాపారం ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. అలాంటి స్టార్టప్‌లకు మూడేళ్లపాటు పన్ను మినహాయింపు ప్రకటిస్తూ, మూడేళ్లపాటు తనిఖీలులేని విధానాన్ని, క్యాపిటల్ గెయిన్స్ పన్నునుంచి మినహాయింపు ప్రకటించారు. అలాగే పదివేల కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు.

01/17/2016 - 06:04

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 13 రాష్ట్రాల్లోని మైనారిటీ యువత ఐసీస్‌కు ఆకర్షితులు కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోలీసు, నిఘా సంస్థల అధిపతులు ఆదేశించారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఐసీస్ కుట్రలు, అరికట్టేందుకు పోలీసు, నిఘా సంస్థల కృషి, చర్యలను సమీక్షించారు. భారతదేశంలోని కుటుంబ విధానం, సంప్రదాయాలు, కుటుంబ విలువలు..

Pages