వైజాగ్ టు అకోలా
Published Friday, 5 August 2016బోధన్, ఆగస్టు 4:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కేంద్రంగా మహారాష్టల్రోని అకోలాకు పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతోంది. ఐదుగురు సభ్యులు గల ముఠా సభ్యులు ఈ గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ గంజాయి రవాణాకు కామారెడ్డి డివిజన్లోని ఇద్దరు వ్యక్తులు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తూ గంజాయిని మహారాష్టక్రు తరలిస్తున్నారు. హైటెక్ పద్ధతిలో సాగుతున్న గంజాయి రవాణాకు బోధన్ పోలీసులు ఎట్టకేలకు కళ్లెం వేశారు. బోధన్ సబ్డివిజన్లోని వర్ని మండలం బడాపహాడ్ వద్ద గతంలో పోలీసులకు గంజాయి రవాణా చేస్తూ విజయలక్ష్మి పట్టుబడగా రూరల్ పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.