వేతనాల చెల్లింపులో జాప్యం వద్దు
Published Friday, 5 August 2016విశాఖపట్నం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు త్వరగా వేతనాలు చెల్లించడం ద్వారానే ఆ పథకం లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి తెలిపారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం వద్దని అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై 3వ అంతరాష్ట్ర అవగాహన సదస్సును ఆమె విశాఖలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 11 రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పథకం దేశంలో 661 జిల్లాల్లో అమలు చేస్తున్నామని, 12 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వెల్లడించారు.