‘చదువు’ చూపులు!
Published Friday, 5 August 2016అనంతపురం, ఆగస్టు 4 : విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు అవుతున్నా జిల్లాలో అనేక మంది విద్యార్థులు పాఠ్యపుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నా ఇంకా సుమారు ఐదారువేల మందికి అందనట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, మున్సిపల్, జడ్పీ మేనేజ్మెంట్లతోపాటు ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెట్, ఇతర మేనేజ్మెంట్లలో 5,024 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5,80,413 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.