గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందిస్తాం
Published Thursday, 4 August 2016జైనూర్, ఆగస్టు 4: ఏజెన్సీలో గిరిజనులు విష జ్వరాలతో బాధపడుతున్న విషయం వాస్తవమేనని, ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినందున వైద్యసేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి కోరారు. గురువారం జైనూర్ మండలంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ఐకెరెడ్డిలు పర్యటించి, ఉసేగావ్, దేవుగూడ పిహెచ్సిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అనంతరం పిహెచ్సి పరిధిలో మంత్రులు మొక్కలు నాటారు.