ఆర్టీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టిఎంయు
Published Tuesday, 19 July 2016వినాయక్నగర్, జూలై 19: గడిచిన పక్షం రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మంగళవారం నాటితో ముగిసింది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగగా, తదనంతరం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టిఎంయు తన సత్తాను చాటుకుంది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం ఆరు డిపోలు ఉండగా, నిజామాబాద్-2 డిపో మినహా మిగతా ఐదు డిపోలలో టిఎంయు భారీ మెజార్టీతో విజయాలు నమోదు చేసింది. అయితే నిజామాబాద్-2 డిపోలో మాత్రం 13ఓట్ల ఆధిక్యతతో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించింది.