జడ్పీటిసి, సర్పంచ్పై కేసు
Published Tuesday, 19 July 2016రేగోడ్, జూలై 19: రేగోడ్ మండల ఎంపిడిఓ బస్వన్నప్ప విధులను అటంకపర్చిన నేరంపై జడ్పీటిసి సభ్యుడు రాంరెడ్డి, గజ్వాడ సర్పంచ్ కిషన్లపై కేసు నమోదు చేసినట్లు ఎఎస్ఐ నారాయణ తెలిపారు. ఈ నెల 16న ఎంపిడిఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.