180 సిసి కెమెరాల ఏర్పాటు
Published Tuesday, 19 July 2016నల్లగొండ, జూలై 19 : జిల్లాలో ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా పోలీసు శాఖ 6,751 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తుందని ఎస్పీ ఎన్.ప్రకాశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పుష్కరాల బందోబస్తు ఏర్పాటు వివరాలను వెల్లడించారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 16 మంది డి ఎస్పీలు, 95 మంది సి ఐలు, 437 మంది ఎస్ ఐలు, ఇతర సిబ్బంది 6,201 మంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. పుష్కరఘాట్లు, దేవాలయాలు, పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు వద్ద 50 లక్షల వ్యయంతో 180 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.