S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

11/16/2017 - 22:56

హైదరాబాద్, నవంబర్ 16: దళిత విద్యార్థులకోసం నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో వౌలిక సదుపాయాలు లేవని, నల్లగొండ జిల్లాలో స్నానానికి చెరువుకు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మరణించారని, వౌలికసదుపాయాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ శాసనసభ నుండి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.

11/16/2017 - 01:50

హైదరాబాద్/చార్మినార్, నవంబర్ 15: రేషన్ షాపుల ను మూసివేసే ప్రసక్తేలేదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీతో పాటు అధికార పార్టీకి చెందిన సభ్యుల ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, పౌరసరఫరాల శాఖలో ఎన్నో సంస్కరణలు తెచ్చామని వివరించారు. బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు.

11/16/2017 - 01:48

హైదరాబాద్, నవంబర్ 15: ఫీజు రియింబర్స్‌మెంట్ సకాలం లో చెల్లించకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకున్న ఉదంతాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేసాయి. కేవలం ప్రభు త్వం ఇచ్చే ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బులను కొల్లగొట్టడానికే ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తే వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటే అక్కసు ఎందుకని విపక్షాలపై పాలకపక్షం ఎదురుదాడి చేసింది.

11/16/2017 - 01:29

హైదరాబాద్, నవంబర్ 15: దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతిబసు రికార్డును ముఖ్యమంత్రి కెసిఆర్ తిరగరాయబోతున్నారని మంత్రి కె తారకరామారావు అన్నారు. రికార్డులను తిరగరాసే దమ్మున్న నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు.

11/16/2017 - 01:27

వరంగల్, నవంబర్ 15: వన భోజనాలకు వెళ్లిన కుటుంబాల్లోని నలుగురు పిల్లలు ఈత సరదాతో కుంటలోకి దిగి మృతిచెందారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం కొత్తపేటలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వరంగల్‌లోని సుందరయ్యనగర్ ప్రాంతానికి చెందిన మూడు కుటుంబాలు, కొత్తపేటకు చెందిన మరో కుటుంబం కలిసి బుధవారం వన భోజనాలకు కొత్తపేటలోని ఈదులకుంట ప్రాంతానికి వెళ్లాయి.

11/15/2017 - 23:25

హైదరాబాద్, నవంబర్ 15: రానున్న రోజుల్లో బస్టాండ్‌లలో 105 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేసే యోచన ఉన్నట్టు రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. బుధవారం నాడు శాసనసభలో ఆశన్నగారి జీవన్‌రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ 140 కోట్లతో ఈ ఏడాది కొత్త ఎసి బస్సులు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.

11/15/2017 - 23:24

హైదరాబాద్, నవంబర్ 15: రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.

11/15/2017 - 23:18

హైదరాబాద్, నవంబర్ 15: ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్న ఇంక్యూబేటర్‌కు అవసరమైన సహకారం అందిస్తామని ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. ఢిల్లీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆదర్శ విధానాలు, పాలసీలు, పథకాలపైన పరస్పర సహాకారం ఇచ్చిపుచ్చుకుంటామన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు.

11/15/2017 - 23:17

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పాత జిల్లా కేందాల్లో ఇప్పటికే జిల్లా గ్రంథాయల సంస్థలు, జిల్లా కేంద్ర గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి. కొత్తగా ఏర్పడ్డ 21 జిల్లాలకు కూడా ఈసౌకర్యం వర్తింపచేయాలని నిర్ణయించారు.

11/15/2017 - 23:17

హైదరాబాద్, నవంబర్ 15: జిహెచ్‌ఎంసి పరిధిలో వరద నీటి కాల్వల వ్యవస్థను మెరుగుపరుస్తామని మున్సిపల్ మంత్రి కె తారకరామారావు పేర్కొన్నారు. బుధవారం నాడు శాసనసభలో జి కిషన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ జిహెచ్‌ఎంసి పరిధిలో 1221 కిలోమీటర్ల మేర మాత్రమే వరదనీటి డ్రైనేజీ వ్యవస్థ ఉందని చెప్పారు.

Pages