S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/15/2017 - 03:17

హైదరాబాద్, మార్చి 14: గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారన్న కారణంతో అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన టిడిపి శాసనసభాపక్షం నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్‌ను ఒకటి, రెండు రోజుల్లో స్పీకర్ ఎస్. మధుసూదనాచారి రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

03/15/2017 - 03:09

హైదరాబాద్, మార్చి 14: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీతో అప్పు చేసి పప్పుకూడు అన్న చందంగా ఉందని అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురిచేసిందని బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ నిశితంగా విమర్శించారు.

03/15/2017 - 02:08

హైదరాబాద్, మార్చి 14: శాసనసభలో తమ సభ్యుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టిటిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని తమ సభ్యులు రేవంత్‌రెడ్డి, వీరయ్యలను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు.

03/15/2017 - 02:06

హైదరాబాద్, మార్చి 14: ఎగువ కృష్ణా ఆధునీకరణ పేరిట కర్నాటక ప్రభుత్వం నాలుగు ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మించాలన్న ఆలోచనపై ప్రతిపక్షాలు ఆందోళన బాట చేపట్టనున్నాయి. ఆ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దీనిపై బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

03/15/2017 - 02:05

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యక్తిగత మొక్కుల కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై సమగ్ర వివరాలను అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

03/15/2017 - 02:05

హైదరాబాద్, మార్చి 14: రైతుల సొసైటీల నుంచే పాల సేకరణ పెరగాలని తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ లోకా భూమా రెడ్డి ఆదేశించారు. మంగళవారం నాడిక్కడ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం లీటరు పాలకు ఇచ్చే రూ.4 అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

03/15/2017 - 02:04

హైదరాబాద్, మార్చి 14: హైదరాబాద్ నగరంలో పాతనోట్ల మార్పిడి గుట్టు రట్టయింది. పాత నోట్ల మార్చుకుంటోన్న 15 మంది ముఠా సభ్యులను నార్త్‌జోన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.20 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నార్త్‌జోన్ డిసిపి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాత నోట్ల మార్పిడి నిందితుల వివరాలు వెల్లడించారు.

03/15/2017 - 02:03

హైదరాబాద్/మేడ్చల్, మార్చి 14: మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ ఫామ్ హౌస్‌లో సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఎయిర్‌గన్‌తో తన భార్యపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి భార్య శిరీషను బేగంపేట్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆమె శరీరంలోని బుల్లెట్లను తొలగించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

03/15/2017 - 02:02

హైదరాబాద్, మార్చి 14: హైదరాబాద్‌లో చిల్డ్రన్స్ బ్యాంకు పేరుతో మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూ. 10 లక్షల నకిలీ నోట్ల చెలామణికి యత్నించిన నిందితుడు షేక్ యూసుఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వౌలాలిలోని అలహాబాద్ బ్యాంక్ ఖాతాదారుడైన యూసుఫ్ మంగళవారం బ్యాంకుకు వెళ్లి రూ. 9.90 లక్షలను డిపాజిట్ చేసేందుకు గానూ క్యాషియర్‌కు ఇచ్చాడు. ఇందులో రూ.

03/14/2017 - 23:51

కొత్తగూడెం, మార్చి 14: సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పోరుబాట పట్టారు. తెలంగాణ లోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు.

Pages