S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/12/2017 - 10:05

హైదరాబాద్, మార్చి 11: అసెంబ్లీ నుంచి టిడిపి పక్షం నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ సభ తీర్మానం ఆమోదించింది. రేవంత్ రెడ్డి సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది.

03/12/2017 - 10:04

హైదరాబాద్, మార్చి 11: వార్ధా- మహేశ్వరం విద్యుత్ లైన్ 15 రోజుల్లో పూర్తి అవుతుందని, దీని వల్ల దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్ పొందే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభలో శనివారం సమాధానం చెప్పారు.

03/12/2017 - 08:49

హైదరాబాద్, మార్చి 11: ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బిజెపి ఘన విజయం సాధించడంతో శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.

03/12/2017 - 07:56

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్రంలో 2017 సంవత్సరం పదోతరగతి పరీక్షలను ఈ నెల 14 నుండి 30 వరకు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆర్. సురేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని (నాంపల్లి) డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

03/12/2017 - 07:56

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ భూసేకరణ సవరణ చట్టాన్ని కేంద్ర హోంశాఖకు పంపి రెండు నెలలు గడచినా ఆమోదం లభిస్తూ ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర హోంశాఖ ద్వారా ఈ సవరణ చట్టం రాష్టప్రతి భవన్‌కు చేరుతుంది.

03/12/2017 - 07:54

మహబూబ్‌నగర్, మార్చి 11: దేశంలో ప్రజలు అత్యధికంగా కీళ్ల నొప్పులబారిన పడి బాధపడుతుండటంతో ఉత్తమమైన కీళ్ల మార్పిడి చికిత్సను చేసేందుకుగాను లండన్‌కు చెందిన డాక్టర్ ఫిలిప్‌హార్ట్స్ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎస్‌విఎస్ మెడికల్ కళాశాల, ఆసుపత్రితో ఒప్పందం కూదుర్చుకున్నారు.

03/11/2017 - 04:54

హైదరాబాద్, మార్చి 10: బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగా సభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత 33 నెలలలో అమలు చేసిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను గవర్నర్ వివరిస్తూ ‘నా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది.

03/11/2017 - 04:47

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 13న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వార్షిక (2017-18) బడ్జెట్‌ను శాసనసభలో ప్రతిపాదిస్తారు. శుక్రవారం ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగించారు. అనంతరం శాసనసభ సభాపతి ఎస్. మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది.

03/11/2017 - 04:37

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ముఖ్యాంశాలను ప్రస్తావించలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రాధాన్యాంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చకపోవటం తెలంగాణ ప్రజానీకానికి విస్మయం కల్గించిందన్నారు.

03/11/2017 - 04:34

హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి శనివారం గవర్నర్ చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని, అన్నీ అబద్ధాలే చెప్పారని బిజెపి ఆరోపించింది. శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం చెప్పినవి ఏమీ చేయకున్నా అన్నీ చేసినట్టు గవర్నర్ చెప్పడం విడ్డూరమని అన్నారు.

Pages