-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీక్కు సంబంధించి నిందితులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి గురువారం తెలిపారు. ఈ ఉదంతంపై సిఐడి పోలీసుల విచారణ ఇప్పటికే పూర్తయిందని, మెరిట్ విద్యార్థులకు నష్టం కలగకుండా తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా, వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాక తాను స్పందిస్తానని ఆయన అన్నారు.
హైదరాబాద్: 8 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లను నియమిస్తూ రెండు రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉమ్మడి హైకోర్టు గురువారం రద్దు చేసింది. వీసీల నియామకాలపై అర్హతలు, నిబంధనలకు సంబంధించి జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే, తెలంగాణ ఎజి రామకృష్ణారెడ్డి అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగువారాల పాటు కోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్: హైకోర్టు విభజన కేసు విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. కేసును విచారించిన డివిజన్ బెంచ్ విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.
హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై సీఐడీ అదుపులో ఉన్న నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మమ్మరం చేశారు. నిందితుల కాల్లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ సహా.. మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లు ఉన్నట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై గురువారం ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సమర్పించనుంది. సీఐడీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంసెట్ నిర్వహించాలా?
హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో రూ. 10 కోట్ల టెండర్లలో రూ. 3.14 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏసీబీ తెలిపింది. నిమ్స్ ఆసుపత్రిలో పరికరాల కొనుగోలు అవకతవకలపై ఏసీబీ గురువారం చార్జ్షీట్ దాఖలు చేసింది. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ అవినీతికి పాల్పడ్డారని, ఆసుపత్రి వైద్యులు ముకుందరెడ్డి, సూర్యప్రకాశ్రెడ్డి, వికాస్ కన్నా పేర్లను కూడా చార్జ్షీటులో ఏసీబీ చేర్చింది.
హైదరాబాద్, జూలై 27: ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. అందుకే ప్రైవేటు పాఠశాలల్లో భారీగా అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించింది. సంఘం అధ్యక్ష్య, కార్యదర్శులు బి. భుజంగరావు, జి.
గజ్వేల్, జూలై 27: మల్లన్నసాగర్ ముంపు గ్రామమైన మెదక్ జిల్లా పల్లెపహాడ్ రైతులు మంత్రి హరీష్రావుతో బుధవారం గజ్వేల్లో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. పట్టణంలోని మల్లారెడ్డి గార్డెన్స్లో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు పల్లెపహడ్ నుండి వచ్చిన రైతులు, ప్రజాప్రతినిధులు, యువకులతో గంటకుపైగా చర్చలు జరిపారు. అయితే రూ.
నల్లగొండ, జూలై 27: జిల్లాలో ఆగస్టు 12 నుండి 23వరకు కృష్ణా పుష్కరాల నిర్వాహణకు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లు ఆలస్యంగా మొదలై హడావుడిగా నాసిరకంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణ పనులు చూస్తే అవన్ని 19రోజుల వ్యవధిలో పూర్తవ్వడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ నెల 28వరకే పనులు పూర్తికావాలన్న అధికారుల ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది కానీ నాణ్యతకు మాత్రం తిలోదకాలిస్తున్నారు.
హైదరాబాద్, జూలై 27: భీమా ప్రాజెక్టు ట్రయల్ నిర్వహించడానికి వెళ్లిన ఇంజనీరింగ్ అధికారులపై దాడి చేసిన టిడిపి, బిజెపి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జలసౌధ ఎదుట టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ సహా టిఎన్జివో నేతలు, తెలంగాణ ఇంజనీర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు బుధవారం ధర్నా చేశారు.
హైదరాబాద్, జూలై 27: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్-2 లీకేజీ అయినట్లు సిఐడి దాదాపు నిర్ధారణకు వచ్చినందున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నందున ప్రభుత్వం వెంటనే మళ్లీ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బిజెపి, ఎబివిపి, ఎస్ఎఫ్ఐ నాయకులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.