-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, నవంబర్ 24: మహిళలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు రూపొందించిన ‘అమరావతి డిక్లరేషన్’ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన ఆవిష్కరిస్తున్నారని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.
విజయవాడ, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్లో పేరుకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ అవి ఏకపక్షంగా జరుగుతున్నాయన్న విషయం కాదనరానిదని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అధికార తెలుగుదేశం, బీజేపీ, పార్టీ ఫిరాయింపు దార్లు మినహా రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రశ్నించే వారే లేకపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రస్తుత శాసనసభ ‘బాతాఖానీ క్లబ్’గా మారిందన్నారు.
విజయవాడ, నవంబర్ 24: రాష్ట్రంలో 2019 నాటికీ ఐటీలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో 2 లక్షలు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి ఐటీ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం అక్షరా ఐటీ కంపెనీ, కేజె సిస్టమ్స్ ఐటీ కంపెనీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 24: చంద్రబాబు ప్రభుత్వం 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఈ విషయమై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని వైకాపా రైతు సంఘం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాలో ఈ ఏడాది వర్షాల వల్ల పంటలు పండాయని, పట్టిసీమ నీటి సరఫరా వల్ల కాదని ఆయన అన్నారు.
నంద్యాల, నవంబర్ 24: రాష్ట్రంలో చేపట్టిన పేదల గృహనిర్మాణంలో ఆధునిక టెక్నాలజీని అవలంభిస్తూ నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఇళ్లలో అన్ని వౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులోని నందమూరినగర్ సమీపంలో చేపట్టిన 13 వేల గృహ నిర్మాణాలను ఆయన శుక్రవారం పరిశీలించారు.
సీలేరు, నవంబర్ 24: ఏవోబీలో మావోయిస్టు దంపతులు మల్కన్గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ ఎదుట శుక్రవారం ఉదయం లొంగిపోయారు. ఎస్పీ కథనం ప్రకారం ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెద్దకర్ణి గ్రామానికి చెందిన చోళి ఒయ్యామ్(23) మావోయిస్టు పార్టీ జననాట్య మండలి పాటలకు ఆకర్షితులై 2009 నవంబర్లో గొంగులూరి ఏరియా కమిటీలో సభ్యురాలిగా చేరింది.
విశాఖపట్నం, నవంబర్ 24: రాష్ట్ర విభజనలో మీరే కీలక భూమిక పోషించారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్తో కుమ్మక్కై ఆడిన నాటకం కారణంగానే రాష్ట్రం విడిపోయిందని విశాఖలో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.
విజయవాడ, నవంబర్ 23: పట్టిసీమతో కృష్ణాడెల్టా ఆయకట్టు స్థిరీకరణ జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిపూర్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
పుట్టపర్తి, నవంబర్ 23: పుట్టిపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సాయినామస్మరణతో పుట్టపర్తి మారుమోగింది. ప్రత్యేకంగా అలంకరించిన మహాసమాధిని పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాబా ప్రసంగాల అనువాదకుడు ప్రొఫెసర్ అనీల్కుమార్ సత్యసాయి అవతారం, లీలలను గురించి వివరించారు.
కాకినాడ, నవంబర్ 23: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కాకినాడ నగరంలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గల మాతాశిశు విభాగంలో ఓ పసికందును గుర్తుతెలియని యువతి అపహరించింది. మాతా శిశు విభాగంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండగానే ఈ సంఘటన జరిగింది. పసికందు అపహరణతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.