S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/14/2018 - 06:36

కాకినాడ, ఆగస్టు 13: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 236 రోజు తూర్పు గోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో సోమవారంతో ముగిసింది. డి పోలవరం శివార్లలోని శిబిరం నుండి సోమవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర తాటిపాక, బిల్ల నందూరు మీదుగా కాకరాపల్లి వరకు కొనసాగింది.

08/14/2018 - 06:35

విజయవాడ, ఆగస్టు 13: ఇక నుంచి రాష్ట్రంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతామని వామపక్షాల నేతలు, జనసేన ప్రతినిధులు పేర్కొన్నారు. విజయవాడ మాకినేని బసవపున్నయ్య భవనంలో సోమవారం వామపక్ష నేతలతో జనసేన ప్రతినిధులు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.

08/14/2018 - 06:34

విశాఖపట్నం, ఆగస్టు 13: నవ్యాంధ్రలో కింది నుంచి పైస్థాయి వరకూ చోటు చేసుకున్న అవినీతిపై త్వరలోనే ఛార్జిషీట్ తెస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధర రావు స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవినీతికి అంతే లేకుండా పోయిందని, అన్ని రంగాల్లోనూ అవినీతి పెచ్చుమీరిందని ధ్వజమెత్తారు.

08/13/2018 - 03:55

తెనాలి, ఆగస్టు 12: నాటి స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై ఉద్యమిస్తున్నట్లు, అమరవీరుల త్యాగాలే మార్గదర్శకాలుగా ముందుకు సాగనున్నట్లు రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు.

08/13/2018 - 03:53

ఒంగోలు, ఆగస్టు 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్ద అవినీతిపరుడని, రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ దోచుకుంటున్నారని సినీనటి, చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు. ఆదివారం ఒంగోలులోని వైకాపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు.

08/13/2018 - 03:50

సామర్లకోట, ఆగస్టు 12: అధికార దాహంతో వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ధ్వజమెత్తారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

08/13/2018 - 03:49

అమరావతి, ఆగస్టు 12: అక్రమాస్తుల కేసులో అడ్డంగా దొరికి ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాల్లో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ఆక్షేపించారు. ఈడీ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు కుటుంబాన్ని రోడ్డుకీడ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.

08/13/2018 - 03:48

విజయనగరం, ఆగస్టు 12: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతానికి సమీపంలో జరగనుండటంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నెల 14వతేదీన జిల్లాలోని సాలూరు మండలం గదబ బొడ్డవలస గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న విషయం విధితమే. ఆ రోజున ఉదయం హెలీకాఫ్టర్‌లో సాలూరు డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు.

08/13/2018 - 03:47

ఆలూరు, ఆగస్టు 12 : కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని హత్తిబెళగల్ క్వారీ ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ నెల 3వ తేదీ జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

08/13/2018 - 03:38

పుట్టపర్తి, ఆగస్టు 12: సమాజంలో ద్విగుణీకృత మార్పులు తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాక్రిష్ణన్ అభిలషించారు. రాజ్యాంగం విలువలతో మమేకం అవ్వాలన్నారు. అనంతపురం జిల్లాలోని ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆదివారం ‘మానవీయ విలువలతో న్యాయవ్యవస్థ’ అంశంపై జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు.

Pages