S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/12/2018 - 04:25

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో వారం లాభాల్లో ముగిశాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ తొలిసారి 38,000 స్థాయిని అధిగమించింది. మొత్తం మీద ఈ సూచీ ఈ వారంలో 313.07 (0.83 శాతం) పాయింట్లు పుంజుకొని 37,869.23 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ ఈ వారంలో 38,076.23- 37,586.88 పాయింట్ల మధ్య కదలాడింది.

08/12/2018 - 04:21

ధర్మవరం, ఆగస్టు 11: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఉద్యోగి పీ భాస్కర్ శనివారం సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు, ఎమ్మెల్యే నచ్చజెప్పడంతో మధ్యాహ్నం కిందికి దిగాడు. హోదా విషయంలో కేంద్రం ధోరణిని నిరసిస్కూ భాస్కర్ ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. అంతకుముందు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

08/12/2018 - 04:20

అమరావతి, ఆగస్టు 11: ఈడీ కేసు విషయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వాదన విచిత్రంగా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ విషయమై జగన్ బహిరంగలేఖకు యనమల శనివారం ఒక ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. ఈ కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందోలేదో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ లేఖ ద్వారా ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనేది తేటతెల్లమైందన్నారు.

08/12/2018 - 04:08

బూర్గంపహాడ్, భద్రాచలం రూరల్, ఆగస్టు 11: ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది.్భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు వంతెన వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయలయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

08/12/2018 - 04:07

విశాఖపట్నం, ఆగస్టు 11: మానవుల్లో నిద్రలేమి జీవప్రక్రియను దెబ్బతీస్తూ జన్యువులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నోబెల్ బహుమతి గ్రహీత, న్యూయార్క్ రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ మైఖేల్ డబ్ల్యూ యంగ్ అన్నారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

08/12/2018 - 04:05

రాజమహేంద్రవరం, ఆగస్టు 11: ఈ నెల 13న నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా కలిసి వచ్చే పార్టీలతో వామపక్షాలు జనసేన, లోక్‌సత్తా, ఇతర ప్రజాతంత్ర భావజాల పార్టీలతో భేఠీ కానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి.

08/12/2018 - 04:04

రాజమహేంద్రవరం, ఆగస్టు 11: మోదీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి తెచ్చి తృతీయ ప్రత్యామ్నాయమే లక్ష్యంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నీ ఐక్యం కావాలని, మోదీ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడమే కార్యాచరణగా పని చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ డి రాజా పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఐక్యం చేసి మోదీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.

08/12/2018 - 01:47

కాకినాడ, ఆగస్టు 11: సారవంతమైన పంట భూములను ఆక్వా, చేపల చెరువులుగా మార్చకుండా, సుస్థిరమైన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్దేశించిన ఆక్వా జోన్ల ఏర్పాటు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగులో అగ్ర భాగాన ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా జోన్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

08/11/2018 - 04:10

పుట్టపర్తి, ఆగస్టు 10: జాతీయ న్యాయ సదస్సుకు అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సంసిద్ధమైంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగనుంది. శనివారం మధ్యాహ్నం విలువలలో న్యాయానుసార ప్రపంచం సదస్సును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా ప్రారంభిస్తారు.

08/11/2018 - 04:09

విజయవాడ, ఆగస్టు 10: రాజధాని నిర్మాణం కోసం శుక్రవారం ఉండవల్లిలోని నివాసం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పలువురు విరాళాలను అందచేశారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ అధ్యక్షుడు కోటేశ్వరరావు 30.25 లక్షల రూపాయలను విరాళంగా అందచేశారు. సీఎం కష్టాన్ని చూసి, ఆ సంస్థ ఉద్యోగులు విరాళాన్ని ఇచ్చారు.

Pages